ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ శ్రీ పరమహంస యోగానంద - "చివరి చిరునవ్వు"

వీరి మహాసమాధికి ఒక గంట ముందు తీసిన ఫోటోగ్రాఫు; భారత రాయబారి వినయ రంజన్ సేన్ గౌరవార్థం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలస్‌లో 1952 మార్చి 7 న ఏర్పాటయిన విందులో తీసింది. ప్రేమమయమైన ఒక చిరునవ్వును ఫోటోగ్రాఫరు ఇక్కడ పట్టుకున్నాడు. ఈ చిరునవ్వు శ్రీ యోగానందగారి లక్షలాది స్నేహితుల్లో, విద్యార్థుల్లో, శిష్యుల్లో ప్రతి ఒక్కరికీ వీడుకోలు దీవెనలా కనిపిస్తుంది. అప్పటికే అనంతలోకి చూపు సారిస్తున్న కళ్ళలో మానవ అనురక్తి అవగాహన నిండిఉన్నాయి.

సాటిలేని ఈ దైవభక్తులను నాశనం చేసే శక్తి మృత్యువుకు లేకపోయింది. వీరి దేహంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఇదొక అత్యద్భుత విషయం.