ఈ పుట ఆమోదించబడ్డది
యోగానందగారు భారతరాయబారికి స్వాగతమియ్యటం.


అమెరికాలోని భారత రాయబారి శ్రీ వినయ రంజన్ సేన్, లాస్ ఏంజిలస్‌లోని సెల్ఫ్ రియలైజేషన్ కేంద్ర కార్యస్థానంలో శ్రీ యోగానందగారితో, 1952 మార్చి 4 న-మహాయోగి మహాసమాధికి మూడు రోజులముందు.

మార్చి 11 న అంత్యక్రియల సందర్భంగా రాయబారి సేన్ ఇలా ప్రశంసించారు: “ఐక్యరాజ్య సమితిలో ఈనాడు పరమహంస యోగానందగారి వంటి వ్యక్తి ఒకరు ఉండి ఉంటే ప్రపంచం బహుశా ఇప్పటికంటె బాగా ఉండేదనుకుంటాను. నాకు తెలిసినంతవరకు భారత, అమెరికా ప్రజల్ని కలపటానికి వీరి కంటె ఎక్కువగా కృషిచేసినవారు, ఎక్కువగా తమను అర్పించుకొన్నవారు మరొకరు లేరు.