ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

21


సమాధానం.

చెప్పుతున్నాను. సరసత్వాపాదనంచేత అభిముఖీకరణం వివక్షితాంశమనేమాటను ఒప్పుకోమని మీరంటే, కావ్యమంతటా "ప్రణయం, మృదులం, విశ్వమోహనం, జింకపడతి" వంటి మెత్తటిమాటలసద్భావం సాదృశ్యంలో వివక్షితాంశమనె మీమాటను అంతకంటె చులకనగా నిరాకరిస్తున్నాము. అయితే యిది రాయిగుద్దుడువాదం. మీరన్నట్లు మెత్తటి మాటలతో అంతటా నిండివుండడమే వివక్షితాంశమని కొంత సేపువొప్పుకొని విచారిస్తాను. అట్లా కావ్యంలో అంతటాప్రణయం , శిరీషం, కన్నెమావి, విశ్వమోహనం, జింకపడ తి యిట్లాటి మెత్తటి అర్ధాల మెత్తటిమాటలే నిండివుంటే భావసంకోచం వెగటు అనే దొషాలు ఆపతితమై రచయితను ఆకృతార్థుణ్ని చేస్తున్నవని యిదివరకే నిరూపించాను. కనుక మమ్మటాదులన్నట్లు దేశ కాలపాత్రాలను అనుసరించి రసభావాలను పరిపాలించి సందర్భం వచ్చినప్పుడు మాధుర్యాధిగుణాల రచనలు ప్రతిపాదించడం శోభా హెతువు తప్పక కాగలదు. లేదా అనౌచిత్యం. భావసంకోచం, వెగటూసంభవించి రచయిత ఆకృతార్ధుడవుతున్నాడని తిరిగి చెప్పుతున్నాను. కనుక యిప్పటి కావ్యాలు కొన్ని అంతటా మెత్తమెత్తటి మాటలతో నిండివున్నవని అది నూతనత్వమని అంటే అట్లావుండడం భావసంకోచం వెగటూవంటి దోషాలకు హేతువని దోషం అంగీకార్యం గాదని, దోషానికి హేతువైన వైలక్షణ్యం నూతనత్వంగాదని అది గ్రాహ్యంగాదని విశదంచేశానని చెప్పి యీవిచారణ ముగిస్తున్నాను.

పూర్వపక్షం

ఈ కాలపు కృతుల్లో స్వాతంత్ర్యమెక్కువ
'ఈకవులు నిక్కముగ స్వతంత్రులు"
      -క. రామలింగారెడ్ది (లక్ష్మీకాంత తొలకరిపీఠిక)
"నవకవులకు స్వేచ్చప్రాణము "
కట్టుబాటులోకవిత్వమా"- దే.కృష్ణశాస్త్రి (యేకాంతసేవపీఠిక)