150
వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం
(ప్రణయగీతాలు, భండారు రాజేశ్వరావు. భారతి. 2-2.)
"నాకు రెక్కలుంటే నీవద్దవ్రాలి నిన్ను ముద్దు పెట్టుకుంటాను."
(నాదెండ్ల వెంకట్రావు, భారతి. -2-2.)
"ఓతరుణీ నీకౌగిట్లో జేరి తనువుమరుస్తాను. నామీద ఆకాశం
(ప్రణయోన్మాదం. పాణిని. భారతి. 1.3.)
"నాప్రణయగాన శబ్దాలకు విశ్వమంతా చలించి నిట్టూర్పు
(వేదుల సత్యనారాయణ శాస్త్రి, భారతి. 1-3.)
"గువ్వజంట చింతచెట్టుమీద సరసమాడుతున్నవి.
చప్పుడైనపుడెల్లా నీవే వస్తున్నావని చూస్తు న్నాను."
(సౌదామిని, భారతి. 1-10.)
"కలికి ఒండొండుకోరనీ వలపుదక్క."
(పువ్వాడ శేషగిర్రావు, చోడవరపు జానకిరామయ్య, భారతి.)
"దానిచీరె కొంగు రాచుకున్నది. నిద్రపట్టదు. దానిచూపులు
దానికులుకులు ఎదురుకొంటున్నవి."
(కవికొండల వెంకటరావు, భారతి. 2-10.)
"నన్ను విబుధులువిడిచినా, నామిత్రులువిడిచినా నాప్రేమభాగ్యఁ
వుంటే నా కేమిభయం."
(గరిగిపాటి రామమూర్తి, భారతి. 2-11.)
"ముద్దులొలుకు నీరూపుపిల్లా, మూర్ఛదెచ్చెనేమో పిల్లా."
(భారతి. 1-12)
"నిన్ను వలచుట జానకీ నేను నేను." (భారతి, 1-11.)
అని అంటున్నారు. పైవాటిలో అక్కడక్కడ మూలపద్యాలను నేను గద్యంలో ఉదాహరించను. యెంకిపాటలు, శృంగారమనే గ్రంథం భారతిలో ప్రణయగీత, ప్రణయసౌధ, ప్రణయోన్మాద ప్రభృతులు వెలువరించిన శృంగారం యిది. మంచిదీ దీనితత్వమేమిటి? ఇది హేయమా? ఉపాదేయమా? అని యిక విచారిస్తాను.