ఈ పుట ఆమోదించబడ్డది

జానపదపాత్రాధికరణం

145


కైదారికాణామభితః సమాకులాః
        సహాసమాలోకయతి స్మ గోపికాః" (మాఘ)
      
అని మాఘుడు గ్రామస్త్రీలను, గొల్లలను గొల్లవనితలను ప్రశంసించాడు.

"విలాసా నాగరస్త్రీణాం న తథా రమయన్తి నః,
 యథా స్వభావసిద్ధాని వృత్తాని వనయోషితాం"

అనిఒకకవి వనకన్యకల చేష్టల ముగ్ధరమణీయత్వాన్ని ప్రశంసించాడు.

మనదేశంలో.

"జొన్నచేలో మంచి సొగసుకత్తెను జూచి
"నిన్నటాలనుంచి నిద్రలేదు" అని.
"యెట్లా పోనిస్తేవోయి మట్లావోరి చిన్నదాన్ని"

అని మొదలైన యాలపాటల్లోను బ్రాహ్మణేతరజానపదపాత్రలు ప్రాచీన కాలంనుండి గోచరిస్తున్నారు. కనుక వీటిలో నూతనత్వంయేమీలేదు.

అవునయ్యా, వీరిని పూర్వులు అప్రధానంగా స్వీకరించారు. వీరు ప్రధాన పాత్రలుగా ఇప్పటి కావ్యాలల్లో వున్నారు. కనుక ఇదికొత్త అని అంటారా? అది సరిగాదు.

"ఓరోరిబండోడ వొయ్యారిబండోడ"

అనే కృతుల్లో వారే ప్రధానం. అవునుగాని అవి చిన్నకృతులు. యెంకిపాటలు మొదలైనవి పెద్దవి అనిఅంటారా? అపుడు చిన్నవి పెద్దవి అనే అనవలెనుగాని కొత్త అని అనడం అసంగతం. కొత్త అని ఒప్పుకున్నా, కొత్త అన్నమాత్రాన మంచిదనే నిశ్చయంలేదని యిదివరకేచెప్పినాను.

అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో జానపదపాత్రాధికరణం సమాప్తం.