94
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం
మధుర హాసంబులో మాధురీ ప్రకృతి
యానందముద్రితం బైనటులుండె
మధుర చంద్రికలో మధురామృతంబు
మధురామృతంబులో మధురరసంబు
మధుర రసంబులో మధుర రూపంబు
మధురభావంబులో మధుర రూపంబు
మధుర రూపంబులో మధుర తేజంబు
మధుర మోహనకళామహితమై వుండ
మధుర స్వరంబులో మధుర గీతములు
మధుర గానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)
అనే పఙ్త్కుల్లో ఒక్క చోట 18 మధురలు వ్రాశారు
"ఒక్కింత యానంద ముండునుగాక
సుఖరం బగుగాక శుభమగుగాక
ఆనంద మగుగాక యందమౌగాక"
అని మూడు పఙ్త్కుల్లో రెండానందులు వేసి తరువాత మూడు పఙ్త్కులుదాటి మళ్లీ
"నిరవధికానంద నిలయమైవున్న"
అని ఆనందను మళ్లీ వేశారు. ఈ కాలపుకృతుల్లో అధికంగా మంజుల మధుర నవ్య దివ్యమృదు, విశ్వమోహన, ఆనంద మనోజ్ఞ అని కుప్పలుగా కనబడుతున్నవి. ఇదంతా శబ్దవాచ్యతే అవుతున్నది.
పూర్వపక్షం
అవునుగాని కావ్యం మధురమైనదని మనోజ్ఞమైనదని చెప్పడానికి ఈ మధురలను బంధురలను ప్రయోగించలేదు. కవి ఈ పదాలను ప్రయోగించి మార్ధవం మీదా మాధుర్యం మీదా తనకుగల అభినివేశాన్ని తెలుపుతున్నాడు అంతేగాదు ఆ సందర్భాల్లో మాధుర్యం మార్ధవం