నాయకురాలు
23
2--వ రంగము
నరసింగరాజు గృహము
(సరసింగరాజు, కేతురెడ్డి ప్రవేశము )
నరసింగరాజు : మాచర్ల మండలములో అభిప్రాయం యెటు మొగ్గుగా వుందో విచారించారా ?
కేతురెడ్డి : ఇప్పుడు ముల్లు మనవైపుకే వున్నా లోకములో రాముడికీ రావణుడికీకూడా స్వస్తిజెప్పి కాలం గడుపు కొనేవాండ్లు చాలామంది వుంటారు. కాలం కుదిరిన తరువాత వారి పలుకుబడి యెక్కువకూడా కావచ్చు.
న : ఏ యెండ కా గొడుగు బట్టేవాండ్లు యెవరికీ ప్రతికూలించరు. ఎదుటవున్న వాడే పెండ్లికొడుకు. మనము మాచర్ల మనదనే అంటూ వుంటే సందేహించి చాలాభాగం యెటూ చేరకుండా వుంటారు.
కే : అక్కడ ప్రొద్దున లేస్తే పొలిమేరదాటి రాంది గడవనివాండ్లు చాలామంది వుంటారు. పంపిణీ యెవరికీ యిష్టముండదు.
న: జోస్యం చెప్పు, నాగమ్మగారి అభిప్రాయం యెటు బోతుందో?
కే: అభిప్రాయాలతో లాభంలేదు. కార్యభారం వహిస్తుందా, లేదా అని ప్రశ్న.
న: వారితో మాట్లాడడానికి మంచిసమయ మేదో విచారించారా?
కే: రెండు జాములకు శివపూజట, అటుతరువాత మంచి సమయమని తెలుస్తుంది.
న : అభిజితులగ్నం బెట్టారే. చీకటితో ప్రయాణంగట్టితేనేగాని అందుకోలేము.