112
నాయకురాలు
"సంధిమిచ్ఛంతి సాధనః " అన్నారు. అట్లాగే పని జేతాము. ఎట్లయితే కుదర్చమని చెప్పారు ?
అ. రా : మాచర్లమండలం తమ్ముల కియ్యడానికి అన్నగారు మొదట ఒప్పుకొన్నదేకదా ! యీ యేడుసంవత్సరాల నుంచి వీరే అనుభవిస్తుండిరి.
నర : తాను బుద్ధిపూర్వకంగా ఒప్పుకోలేదంటారు.
అ. రా : కాకపోతేమట్టుకు తనకుమాత్ర మేనూరుమంది వున్నారు. ఒక్క ఆడపిల్లేగదా !
నర : అట్లని రాజ్యం వదలుకుంటారా ? మనం సంపాదించేదంతా మనకోసమేనా?
అ. రా : తనతరువాత రాజ్యం దౌహిత్రాన్నిబట్టి మాకుటుంబములో కే వస్తుంది. దాయాదులతో తగాదా లెందుకని బ్రహ్మనాయుడు చెప్పిన రాజీకికూడా మొదట ఒప్పించా. కన్నుదగిలేపుల్లను ప్రతిదాన్నీ కనిపెట్టేవుండాలె.
నర : నా సంగతేమీ చెప్పించరా ? మీకు కొమాళ్లు కలుగకపోతే నేనే తరువాతవాణ్ణిగదా ?
అ. రా : ఇప్పటికి మీ అన్నేరాజుగదా, అధికారమంతా మీరే చలాయిస్తుంటిరి. వారసత్వం వచ్చినప్పుడు మీ సంగతి చెప్పకుండానా? ఏ మట్లావున్నారు? బొత్తిగా వేలబడి పోతున్నా రే!
నర : భోజనానికి వేళదప్పింది. పైత్యపుభ్రమ వచ్చింది. ఇంకా వూరు ఎంతదూరముండేను ?
అ. రా: ఎంతలేకేమి? రెండుకోసు లుంటుంది.