పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/15

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సింహావలోకనము

కాని చెవులకు విశ్రాంతి కలిగెను. వెంట వెంటనే వీరిని మఱిరెండు వేషములు చూచితిని; మెచ్చితిని.

     నామిత్రులు కొందఱు పారుపల్లి సుబ్బారావుగారిని చూడు మనిరి.  వారిమాట వింటిని.  శాంతమును, గంభీరమును అగు వారివేషము నన్నాకర్షించెను.  నాటకములు చూచుట నల్లమందువలె అలవాటులో పడజొచ్చెను.
  ఇటులుండగా బళ్లారి రాఘవాచార్యులవారు బెజవాడ వచ్చిరి.  వీరిని నాలుగయిదురూపములలో జూచితిని.  ఆంధ్రనాటకసారస్వతమున ఒక అభావమును, ఒకశూన్యమును, ఒకలోపమును వీరు నాకనులకు చూపిరి.
     గొప్పనటుడు ఉద్భవించెను, గొప్ప నాటకములు ఉద్భవింపలేదు.
    దానివలన వీరి ప్రదర్శనములలో కొన్నికొన్ని ఘట్టములు సినీమా లాయెను.  అంకాంతములందు, లేక అటువంటివానియందు పాత్రము లేవోఅను భావముల నభినయించుచుండగా తెరపడును.  దాన అంభావం వ్యక్తమగును.  అంగహారమువలన అనుభావవ్యక్రియేకాని కవితలో వ్యక్తి లెదు.  అట్టి యెడల రాఘవ్డే యగుగాక యేమి చేయగలడు?
   ఈ రాఘవునిమహిమచే రాలుగాపడియున్న పలువురహల్యలు రంగముమీద రూపపు వడసిరి, పడయుచున్నారు, పడయగలరు.  ఇటుల శాపవిమొచనమందిన మొదటినటిని నేను చూడలేరు కాని ఆమెకు పరబ్రహ్మాచారిణియగు పద్మావతీదేవిని మొన్న చెన్నపురిలోని పరిషనాటకసందర్భమున 'పప్పెవది ' లో చూచితిని.  మగావా రాడువేసము వేయుటతప్పు అని ఈమె చెప్పక చెప్పెను (ఒక్క దాడిగోవిందరాజులవంటివారి మాట తప్ప).
                         ఉత్తర రంగము

1934 డిసెంబరు చివర చెన్నపురిలో నాట్యకళాపరిషత్తు ప్రారంభించిన దీర్ఘసత్రమున పలువురు నటులను చూడ తటస్థించెను. పర్మావ్తీరాఘవులొక ప్రహసనము ప్రదర్శించిరి. నా కొనరించినది నాట్యముకాదు. అది నాట్యాభాసమును విమర్శించు ఆనందాత్మకమగు నాట్యకవితాకుల్య. ఈ రాఘవుని గుఱించి యిక వ్రాయను. ఈయన కలమునకును, కాకితమునకును మిగిలి యుండును.

      పారుపల్లిసుబ్బారావుగారిలో శాంతి పక్వమాయెను.  శ్రీరామమూర్త్రిలొ గానవార్ధకములు పో'టీచేసెను.  తుంగల చలపతిరాయని గాన