పుట:Naajeevitayatrat021599mbp.pdf/831

ఈ పుట ఆమోదించబడ్డది

లేనందున, తనకు వచ్చే నష్టం ఒక లెక్కలోది కాదన్నారాయన.

"ఎంత శుభ సమయాన, జ్యోతిష్కులు చెప్పినట్టు మంత్రి అయినా, కలకాల మెవడూ మంత్రిగా ఉట్టి కట్టుకు ఊగబో"డన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీకి తాను అడ్డు రానన్నారు.

ఆంధ్రరాష్ట్ర శుభారంభము

జవహర్‌లాల్ నెహ్రూగారు దాదాపు ఇరవై అడుగుల ఎత్తు వేదికపైనుంచి, రాజ్యావతరణ దీపం వెలిగించి, సహజ గాంభీర్య వచన రచనలతో ఉపన్యాసము సాగించారు. రాధాకృష్ణగారు ఆశీర్వదించారు. వారి ఉపన్యాసంలో ఏ విధమైన లోటూ లేదు. కాని, అతిజాగ్రత్తగా 'అమర జీవి పొట్టి శ్రీరాములు' అనే అక్షర క్రమం తమ మాటలలోకి రాకుండా మాట్లాడగలిగారు.

తొలి ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకరణ సందర్భంలో ముఖ్యమంత్రి ప్రకాశంగారు, శ్రీయుతులు డి. సంజీవయ్య, కోటిరెడ్డి, గవర్నర్ త్రివేది, తెన్నేటి విశ్వనాథం, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. (Courtesyː P. I. B.)