పుట:Naajeevitayatrat021599mbp.pdf/312

ఈ పుట ఆమోదించబడ్డది

చేపట్టాలనే కోరిక అంత ముమ్మరంగా ఉందన్నమాట.

ఈ విధానానికి లోబడిపోతూన్న స్వరాజ్యవాద నాయకులను, 1925 లో కాన్పూరు కాంగ్రెసు తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించి, పతనం ఎంతవరకూ వచ్చిందో గ్రహించి మరీ వ్యవహరించమని హెచ్చరించకుండా, ఉండలేకపోయాను నేను.

కాన్పూరు కాంగ్రెసువారి మొదటి తీర్మానానికి పండిత మాలవ్యాగారు సవరణ సూచించారు. అ సవరణను జయకర్‌గా రంగీకరించి బలపరిచారు. దాని ప్రకారం, దేశానికి అనువయిన పరిపాలనా విధానాన్ని అమలు పరిచే నిమిత్తం శాసన సభా కార్యకలాపాలు ఉత్తేజ పరచాలనీ, అప్పుడే ప్రతినిధులు ప్రభుత్వం వారితో సహకరించడమో, రాజ్యాంగాన్ని నిరసించడమో త్వరగా తేలుతుందన్నారు. ఈ సవరణ ఆమోదింపబడింది.

జయకర్, హోల్కార్, మూంజీగారలు స్వరాజ్య పక్షీయులలో వచ్చిన విభేదాలవల్ల రాజ్యాంగ సభా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. దీనికి ముందుగా అఖిల భాతత స్వరాజ్యపార్టీ కమిటీవారి మీటింగులో స్వరాజ్యవాదుల మధ్య రాజీ ప్రతిపాదన ప్రసక్తి వచ్చింది. మోతిలాల్ నెహ్రూగారు మంత్రి పదవిని చేపట్టడం విషయంలో తానున్న పరిస్థితినీ, తన సాధక బాధకాలనీ వ్యక్తపరిచారు.

పదవీ స్వీకరణ సమస్య

ఆ తరవాత మోతిలాల్‌గారు పదవీ స్వీకరణం గురించి, స్వరాజ్య వాదుల పద్ధతి ప్రకారం ఈ దిగువ షరతులు అంగీకరింపబడా లన్నారు

1. ప్రభుత్వం వారికి మంత్రులపై ఎలాంటి ఆధిపత్యమూ ఉండ కూడదు. మంత్రులు శాసన సభా మర్యాదలను పాటిస్తూ, వాటికి అనుగుణంగా నడవాలి.

2. జాతీయ ప్రణాలికావసరాలకు కావలసిన ధనం ప్రత్యేకింప బడాలి.

3. తమ ఆధీనం చేయబడిన అంశాల నిర్వహణ సవ్యంగా