పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

56

మహాపురుషుల జీవితములు



ముందువానికిఁజూపియతఁడు మెచ్చిన తరువాతనే ప్రతిష్ఠలఁజేయుచు వచ్చిరి. రామకృష్ణున కద్భుతమయిన జ్ఞాపకశక్తిగలదు. ఒకమారు భాగవతు లాయూరికివచ్చి జలక్రీడ లాడఁగా నాబాలుఁడది చూచి కథయంతయు జ్ఞాపకముపెట్టుకొని తరువాతఁ దోడిబాలురచే నాకథ యాడించెను. ఆయన వసియించు గ్రామము జగన్నాధక్షేత్రమునకు బోవుదారిలో నుండుటచేత యోగులు సాధువులు సన్యాసులు వచ్చి యాయూరిసత్రములో బసచేయుచుండిరి. అప్పుడు రామకృష్ణుఁడు వారియొద్దకుఁబోయి వారివల్ల ననేకాంశములంగ్రహింపుచువచ్చెను.

తనయూరి జమీందారుఁడు మృతినొందఁగా నుత్తరక్రియల సమయమున చుట్టుప్రక్కల పండితులనేకు లచ్చట చేరిరఁట. ఆసమయమున వారికి వేదాంత విషయమయి సందేహముదోప వారు చర్చలుచేయుచుండ బాలుఁడగు రామకృష్ణుఁ డక్కడకుఁబోయి సందియ మవలీలగాఁ దీర్చెనట. పండితు లందఱు వానిని మహానుభావుఁడని కొనియాడిరి. రామకృష్ణునిపెద్దయన్న రామకుమార చటోపాధ్యాయులు సంస్కృతమున పండితుఁడై కలకత్తాలోనొకపాఠశాల బెట్టెను. తండ్రి రామకృష్ణునకుఁ బదియాఱవయేట నుపనయనము చేసి చదువునిమిత్తము వానిని బెద్దకొడుకున కప్పగించెను రామకృష్ణు డాబడిలోఁ గొన్ని నాళ్ళు చదివి యెంతకాలము చదివినను నాలుగు రూకలు సంపాదించుటకు వినియోగించు విద్యలేగాని మోక్షసాధన మయిన చదువులేదని విసువుఁజెంది యాబడిలోఁ జదువుకొనుట మానెను.

1853 వ సంవత్సరమున కలకత్తానగరమున కైదుమైళ్ళదూరమున రాణిరాసమణియనుజమీందారురాలొకర్తు దక్షిణేశ్వరస్వామి యాలయమును గట్టించెను. ఇది హిందూదేశమున శ్రేష్ఠమయిన