ఈ పుటను అచ్చుదిద్దలేదు
5
డైరీలు
8 నవంబరు :
మహారాజావారి నాటక సమాజమువారు 'శకుంతల' ప్రదర్శించిరి. మహారాజావారు ప్రదర్శనమునకు విచ్చేసిరి.
10 నవంబరు :
మహారాజావారు విజయనగరంనుంచి బయలుదేరారు.
1891
30 జూన్ :
దేవరపల్లిలో రాజమ్మ వివాహమహోత్సవం.
1892
17 అక్టోబరు :
మహారాజావారివద్ద రెండువేల రూపాయిలు బదులు పుచ్చుకున్నాను.
1893
10 డిసెంబరు, ఆదివారం :
ఉదయము 5 గంటలుకు ఆడుతూ పాడుతూ భోజనం చేసి 7 గంటలుకు విజయనగరంలో రెయిలు యెక్కడమైనది. రెయిలు పడివరకు యెప్పుడు పడునని ఆసక్తితో యెదురు చూచుచుంటిమి; గాని రెయిలు పడ్డతర్వాతకూడ గొణగడముకు కావలసినన్ని అవకాశములు రెయిల్వేవారు కల్పించినారు. ఊళ్ళదగ్గిర స్టేషనులు వుంటే ఉపద్రవము వస్తుందని