వించిరి. చిన్నప్పటినుండియు విద్యను నేర్చుకొను విషయములో చాలా అక్కర గలవారు. వృధా కాలక్షేపము చేయరు. దుడ్డు వృధాగా ఖర్చుపెట్టరు. దేహారోగ్యమునకు భంగము కలుగజేయునటువంటి సిగరెట్టు బీడీ మొదలగు దురభ్యాసములగు అలవాటులు లేవు. మెట్రికులేషన్ పరీక్షతేరి క్రిష్టియన్ కాలేజీలో బి. ఏ. పరీక్ష ప్యాసుచేసిరి. బి. యల్. పట్టమొందిరి. వెనుక మదరాసులో హైకోర్టు వక్కీలు పిదప హైకోర్టు జడ్జిగాయుండిన మ-రా-రా-శ్రీ, P. R. సుందరయ్యరువారి ఆఫీసులో అప్రెంటిస్గా చేరి న్యాయవాది వృత్తిలో ప్రవేశించిరి. పిదప తమ స్వంత జిల్లాయగు చిత్తూరు జిల్లాలో 1909 సంవత్సరమున ప్రాక్టీసుచేయ నారంభించిరి. న్యాయవాది వృత్తిలో దినక్రమేణ అభివృద్ధికి వచ్చిరి. రైతులకుండు అన్నివిధ కష్టముల తెలుసుకొనిరి.
4. ఉభయ వాదులకుగల వివాదాంశములను చక్కగా తెలుసుకొని యుభయ పార్టీలకు నొప్పజెప్పి రాజీపఱచువారు. స్వప్రయోజనము కొఱకు వ్యాజ్యములను పెంచరు. అందువల్ల యెదురు పార్టివారికి కూడ యితనియందు నమ్మకము గలిగెను. కేసులను రాజీచేసి రాజీనామా వ్రాసినప్పుడు ఎదురుపార్టీవారు నిస్సందేహముగా రాజీనామాలో ముందు చైవ్రాలు చేయుదురు. న్యాయవాది వృత్తిలో మాత్రముంటే రైతుల కష్టములు అన్నిటిని నివర్తించుటకు సాధ్యములేదని యోచించుచుండిరి. అప్పటిలో జిల్లాబోర్డు ప్రెసిడెంటుగాయుండిన మ.రా.రా.శ్రీ, రావుబహదూరు టి. వి. రంగాచార్యులు వారు మ.రా.రా.శ్రీ, నాయుడుగారిని డిస్ట్రిక్టుబోర్డు మెంబ