పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/128

ఈ పుట ఆమోదించబడ్డది

128

మత్తేభమందలి, రెండు మొదటి లఘువులను, ఒకగురువుగా, మార్చిన అది శార్దూలమగును.

మత్తకోకిల, లోని మొదటి గురువును, రెండు లఘువులుగా, మార్చిన అది తరళమగును.

తరళము మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మార్చిన, నది మత్తకోకిల యగును.

ద్విపద యొక్క పాదమును రెట్టించి అనగా రెండు ద్విపదపాదముల నొక్క పాదముగా చేర్చి 3-5-7 గణముల మొదటి అక్షరములకు యతికల్పించినచో నది తరువోజ యగును.

తరువోజ పాదమును రెండు సమభాగములుగా చేసిన, నది ద్విపదయొక్క రెండు పాదములగును.

ప్రశ్నలు

1) గురు లఘువునెట్లు గుర్తింతువు ?
2) యతి - ప్రాసల గూర్చి వ్రాయుము ?
3) సూర్య - చంద్ర - ఇంద్ర గణములేవో వివరింపుము.
4) పద్యము లెన్ని రకములు ? అవి యేవి ?
5) ఉపజాతుల లక్షణములేవి ?
6) ఈ క్రింది పద్యములకు లక్షణములు దెల్పుము.

1) శార్దూలము 2) మత్తకోకిల 3) స్రగ్దర 4) మహాక్కర 5) తరలము 6) చంపకమాల 7) సుగంధి 8) మాలిని 9) ఆటవెలది 10) కందము.

సులభ వ్యాకరణము