పుట:KutunbaniyantranaPaddathulu.djvu/78

ఈ పుట ఆమోదించబడ్డది

7. రక్షితకాలం పాటించటం సేఫ్ పిరియడ్

మధ్యంతరంగా మతం పుచ్చుకున్న మోహన్ రావు మస్టర్ మోజస్ గా మారిపోయాడు. అప్పటికే అతనికి అయిదుగురు పిల్లలు. ఎప్పటికప్పుడు ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషను చేయించుకుందామనుకుంటూనే క్రొత్త మతము లోకి చేరిపోయాడు. ఇక ఈ మతం ప్రకారం "బిడ్దలు దేముడిచ్చే బిడ్దలు, బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం మహాపాపం" ఏదీ బుఱ్ఱకి ఎక్కినా ఎక్కక పోయినా ఇది మాత్రం అతని బుఱ్ఱకి బాగా ఎక్కింది. మతం మారినా పూర్ ఫెలో మిస్టర్ మోజస్ పుట్టిన పిల్లలకి, పుట్టబోయే పిల్లలకి ఎందరికని తిండి, బట్ట చూడగలడు? అందుకని దేమనికి ఆగ్రహం కలిగించకుండా "పాపం" కాని పద్ధతి అవలంబించి పిల్లలు కలగకుండా చూచుకోవాలను కున్నాడు. చివరికి "సేఫ్ పిరియడ్" అంటే ఏమిటో తెలుసుకొని కుటుంబనియంత్రణ అవలంబించసాగాడు. కాని భార్యకి బహిష్టులలో అస్తవ్యస్తత వుండటంతో అతని ఆశలు అడియాసలై ఆమెవ్ తిరిగి గర్భవతి కావడం జరిగింది.

ఈ "సేఫ్ పిరియడ్" నే కుటుంబ నియంత్రణ ఫాటించ