ఈ పుట ఆమోదించబడ్డది
నివాళి
అరకప్పు కాఫీ తాగి ఆకలి తీర్చుకునే అర్భకుల అర తెలుగుతనానికి అందని అవధాన సాహితీ గగనంలో మెరిసే ఇరుతారలు శ్రీ కొప్పరపు కవులు.
తిరుపతి వేంకట కవులు, కోటసోదర కవులు; వీరిబాటలో వేటూరి వేలూరి కవులు కొడాలి విశ్వనాధ కవులు, వేంకట పార్వతీశ్వర కవులు అవధాన సాహితీ సరస్వతిని అర్చించిన వారే.
అఖండ సృజనాత్మకత, అపార శేముషీ వైభవం, అద్వితీయ సమయస్ఫూర్తి, అనంత ధారణా సిద్ధి కలిగి ఆ వీరకవులు ఆంధ్ర సాహితీ క్షేత్రంలో చేసిన స్వైరవిహారం ఒక సువర్ణాధ్యాయం.
శ్రీ తిరుపతి వేంకట కవులతో పాటు ప్రధమ స్థానీయులై కవితా శిల్పం సల్పిన శ్రీ కొప్పరపు కవులను స్మరించుకోగలగడం నా భాగ్యం.
వేటూరి సుందరరామమూర్తి.
17-10-2003