ఈ పుట ఆమోదించబడ్డది
మాల]
కొండవీడు
39
కృషికుఁ డంతటఁ బున్కను గేలనెత్తి
యశ్రుధారాభిషేకంబు నాచరించి,
భయమునను సంభ్రమంబునఁ బలుకకున్న
తనయునిం గాంచి గద్గదధ్వని వచించె:
'మాతృదేశపరాయణ మానసులయి
సలిపి రిచ్చోట రెడ్డివీరులు రణంబు;
కత్తిగంట్ల నమూల్యరక్తంబు దొరఁగి
కీర్తివల్లిక పాదు కిక్కిఱిసి నిండ.
'శ్యామలాకాశవీధి నక్షత్రము లటు
కాలవాహినీతటములఁ గానిపించు
రెడ్డివీరకుమార చరిత్రపాద
చిహ్నములు, మృతశౌర్యంబు చివురువెట్ట.
'అరివీరుల్, పులిగర్జలన్ విని కురంగానీకముల్ కాననాం
తరముం జొచ్చెడుపోలికన్ రణమునన్ ధైర్యంబువోనాడి యే
డ్తెఱఁ బర్వన్, భుజవిక్రమంబు బలమున్ దీపింపఁ బోరాడి కీ
ర్తి రమం గాంచి ధరిత్రిగర్భమున శాంతింబొందువారల్ నృపుల్