ద్యము]
పూర్వజన్మస్మృతి
151
మటమట యెడలం బసుల మావులక్రిందఁ బరుండఁదోలి చి
క్కటి పెరుగన్నమున్ మిరపకాయలు నంజుచు నారగించి యొ
క్కట గుమిగూడి, యాదవుల గాథలు నీవు వచింపఁగన్ నదీ
తట పవనంబు వీవఁ గడఁదాఁకిన సంజలు నేఁడుఁ గల్గునే?
కాళింది మడుగులో నా
భీల విషజ్వాల లెపుడు వెలిగ్రక్కుచు మా
బాలురఁ బెయ్యలఁ జంపిన
కాళీయఫణి కథలు దలఁపఁ గాయమువడఁకున్.
ఆ సర్పంబు భయంబునం బసులు నీరానన్ విలంబించి యా
కాసారంబును డాయఁబోయి వెనుకోఁగాఁజూచి నాగేంద్ర, చా
వాసన్నంబయియుంట నీ పొగరుఁబోతాటల్ విజృంభించెఁగా
నీ సై లెమ్మని హుంకరించిన నినున్ నేఁడైన నూహించెదన్.
బరబరఁ జేలమున్ నడుముపై బిగియించి, కిశోరసింహ మ
ట్లురవడిఁజూపి, మమ్ముఁగని యోసఖులార, భయంబులేదు; నే
నురగముఁ జంపివత్తు నని యొడ్డుననున్న కుజంబునెక్కి మో
హరమునఁ బాముపై దుమికినప్పటి నీ రభసంబుదోఁచెడిన్.
బుస్సుబుస్సున గాలి భోకొట్టినట్టుల
విసపు నిటూర్చులు దెసలుముట్టఁ,
బాతాళగర్భంబుఁ బగిలించి శేషాహి
పైకిలేచిన రీతి ఫణములెత్తి