ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

79

ఈపైపద్యములలోనికథసోమయాజి స్వయముగఁ జెప్పినవృత్తాంతము గావునఁ బుక్కిటిపురాణములకంటెఁ బూర్ణముగ విశ్వసనీయము గదా! కనుక దానిం జెప్పెడుపద్యముల వివరించినాఁడను, ఇపు డందులకథా సంగ్రహము వ్రాసెదను, ఎట్లన్న :- తిక్కనసోమయాజి హరిహరనాథ రూపుఁ డగుపరవస్తువును సకలబ్రహ్మవస్తువుగా ననఁగా సగుణబ్రహ్మముగాఁ బ్రార్థనము చేసి యట్టి సగుణబ్రహ్మయొక్క ప్రసాదముచేత లబ్ధమైనకవిత్వతత్త్వనిరతిశయానురూపానంద భరితాంతఃకరణుఁ డై యుండి యొక్కనాఁడు తనలో నిట్లుగా నాలోచించుకొనియెను. తొల్లి కృష్ణ ద్వైపాయను డనంబరఁగువ్యాసమహర్షి లోకహితార్థము ధర్మాద్వైతస్థితికొఱకుఁ బంచమవేద మనంబరఁగు భారతమును రచియించెను. అది పదునెన్మిదిపర్వములుగా నుండును. అందు మొదటిమూఁడు పర్వములను ఆంధ్రకవిత్వవిశారదుం డగునన్న యభట్టారకుఁడు తెనింగించెను. ఇఁక నాల్గవపర్వము మొదలు అనఁగా విరాటపర్వము మొదలు పదేనుపర్వములు జనసంప్రార్థ్యము లౌటం జేసి తుదముట్ట నాంధ్రీ కరించుట తగవు. అని ఇట్లు చెప్పుట నావఱకు నొకపండితునిచేఁ దెలిఁగింపఁబడిన భాగముంగూడ మరలఁ దాను దెలిఁగించినచో నాతనిభాగము లోకములో వ్యాపింపకయే యుండును; ఆకవినామమును శాశ్వతముగా నుండకపోవు నని యెంచి యందులకు సోమయాజి సమ్మతింపక పోవుటచే భారతము ప్రథమమునుండి ప్రారంభించ లేదని యూహింప నై యున్నది. సోమయాజి పైవిధముగ వ్రాసి గ్రంథరచనాకుతూహలంబున నుండి యీప్రబంధమండలికిఁ గృతిపతి నెవ్వరిం బేర్కొనువాఁడ నని యున్న సమయంబున నతనికిఁ గొంచెము నిద్రవచ్చెను. అపుడొక స్వప్నం బాయె నని దాని నీక్రిందివిధముగ వివరించుచున్నాఁడు. ఎట్లన్నను :-

సీ. "మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్రమహితుండు భాస్కరమంత్రితనయుఁ
    డన్నమాంబాపతి యనఘులు కేతన మల్లన సిద్ధనామాత్యవరుల