ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

77



యాజియుఁ జేసియున్నాఁ డని ఆతని రెండవగ్రంథ మగుభారతములో మనుమసిద్ధియాస్థానములోనివాఁడ నని యుచ్చరింపఁబడకపోవుటచేత నిస్సంశయముగాఁ జెప్పనొప్పి యున్నది. ఇఁక రెండవశంకకు సమాధాన మెట్లన్న - భారతములో స్మరియింపఁబడిన హరిహరనాథుఁడు అర్చావతారరూపుఁ డై నెల్లూరున వేంచేసి యున్న హరిహరనాథుఁడు కాక కేవలమును నద్వైతుల కుపాస్యుం డగుహరిహరులకు నధినాథుఁ డగునద్వయనిర్గుణబ్రహ్మ మని భారతములోనియాశ్వాసాద్యంత పద్యముల నద్వైత శాస్త్రసంప్రదాయమునఁ జూచిన స్పష్టము కాఁగలదు. కావునఁ బై రెండుయుక్తులును సోమయాజి నెల్లూరుపురవాసి యని చెప్పుటకుం జాలవు. భారతరచనాపూర్వకాలములో సోమయాజి కాశీయాత్రఁ జేయుచుఁ గాశినుండి యీగ్రంథరచనకు వచ్చియున్నాఁ డని చెప్పెడుసంప్రదాయజ్ఞవాక్య ముభయపక్షములలో నిర్బాధకమే అయి యున్నది. పై నుదాహరింపఁబడిన ప్రాటూరుగ్రామవాసి యనుదాని నింకొకవిధముగా సమన్వయించెదము. గుంటూరువాసమునకుఁ బూర్వము సోమయాజితండ్రితాతలు ప్రాటూరుగ్రామవ్యాస్తవ్యులు కానోవుదురు. దానింబట్టి యీకుటుంబము వారికి 'ప్రాటూరివారు' అనుగృహనామము కల్గి యుండును. అనంతరము సోమయాజివంశస్థులు లౌకికు లగుటచేత వ్యాపారాంతరముల నితరదేశములకుఁ బోయి యుండినను గృహనామముమాత్రము ప్రాటూరివారే అని యుండుట ఆంధ్రదేశసంప్రదాయము కావున వీరికిని నట్లె అయ్యె నని సిద్ధాంతము.

సోమయాజిచే రచియింపఁబడినకావ్యములు.

ఇతఁడు ప్రథమములో నిర్వచనముగ రామాయణముతోఁ జేరిన యుత్తరకాండముఁ దెనిఁగించెను. దీనినే నిర్వచనోత్తరరామాయణమని వాడెదరు. అనంతరమున సంస్కృతమహాభారతములోని పదేనుపర్వముల నాంధ్రీకరించెను. కవివాగ్బంధన మనులక్షణగ్రంథముంగూడ రచియించెను.