ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

కవి జీవితములు



వాటి కవిరాక్షసుడు" అని భీమకవికి బిరుదు నొసంగెను. ఈమాట భీమకవి లేనిచో నతనిపరోక్షములో నప్పకవి వ్రాసి జీవించి యుండెంగాని భీమకవి యుండఁగనే వచియించిన నప్పకవి అంతకువురిచెంతకుఁ బోకయుండునా? ఈ ప్రసంగ మింతటితోఁ జాలించి యొక్కసంగతిమాత్రము విజ్ఞాపనజేసి యీవృత్తాంతము విడిచెదము. భీమనఛందస్సనుగ్రంథము భీమకవివిరచితము గాక భీమకవియొక్క అగ్రపుత్రునివలన రచియింపఁబడినది. అందుల విశేషము లన్నియు నాభీమకవిచారిత్రములో జూడం దగును. భారతానంతరము భీమకవి ఛందస్సు నడఁచుటఁకుగా నీవ్యాకరణము నన్నయ చేసె ననుమాట భారతము రచియించుచున్న సమయములోనే నన్నయభట్టునకు మతి పోయె నని యున్న కథవలన నిర స్త మగుచున్నది.

తిక్కన మొదలగు తొల్లింటి తెలుఁగుకవులు భారతము మూఁడు పర్వములలో నన్నయవలనఁ బ్రయోగింపఁబడిన తెలుఁగుల నరసికొని తాము గ్రంథములు వ్రాసికొని రని యింకొకమాట చెప్పఁబడినది. ఇది పైదానికంటె నద్భుతముగా నున్నది. అప్పకవియభిప్రాయము తిక్కనసోమయాజి నన్నయభట్టునకు శిష్యుం డని చెప్పవలయు నని కాఁబోలును? తిక్కనవృద్ధపితామహప్రపితామహులనుండియుఁ గవిత్వమహత్తు గల దని యీతఁ డెఱుఁగఁడు. దీనికి దృష్టాంతము వలయునేని తిక్కనసోమయాజి నిర్వచనోత్తరరామాయణములోని

"సారకవితాభిరాము గుంజూరివిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి"

అనుపద్యము చూచుకొనవలయును. ఇంతియకాక తిక్కనసోమయాజి విరచితము లగుభారతములోని పదేనుపర్వములును సావధానముగఁ జూచినచో నీసంశయము తొలఁగిపోవుటయేకాక నన్నయభట్టునకు సోమయాజులవలన నేర్చుకొనవలసినయంశములు పెక్కు లుండిపోయిన వని సులభముగ బాలురకుంగూడ బోధయగును. ఇదియునుంగాక రంగనాథ రామాయణము భాస్కరరామా