ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

71



కొనుట కలవిగా కున్నది. ఇది కేవలము స్వప్నములోనివార్త యవుటచేతఁ జారిత్రముగా నమ్మ వలనుపడదు. నమ్మినను నమ్మకున్నను అప్పకవి యిట్లుగా వ్రాయుటకుఁ గారణ మేమియై యుండు నని యూహింతము. అది యొకకారణమువలన నై యుండునేమో యని యూహింపనై యున్నది. ఎట్లనఁగా :- ఆవఱకుఁ బేరైనను వినఁబడక యుండునాంధ్రశబ్ద చింతామణిగ్రంథంబు నీతఁడు తెనిఁగించి వ్యాపింపఁజేసె ననియెడివిఖ్యాతిని సంపాదించుటకై కావలయును. దీని కనువగునట్లుగా నితనివలన వాక్రువ్వఁబడినకథయందుఁ గలపరస్పర భేదములు మనమాటను స్థిరపఱుచుచున్నవి. అందు మొదటిదానిలో నన్న యభట్టు భారతముం దెనిఁగించి భీమనవలన రచియింపఁబడిన రాఘవపాండవీయము నడంచి భీమకవి ఛందస్సుగూడ నడఁగించుటకుఁగాను వ్యాకరణమును సంగ్రహించి యుండె ననియు భీమకవి యీవ్యాకరణమును బూర్వపక్షము చేసె ననియును జెప్పెను. దీనింబట్టియే రాఘవపాండవీయ మనుభీమనకృతిని నన్నయభట్టు పూర్వపక్షము చేసెననియు భీమకవి దానికిఁ బ్రతినిధిగా నన్నయభట్టీయ మగువ్యాకరణము పూర్వపక్షము చేసె ననియు స్పష్ట మగుచున్నది. ఇఁక నిర్వురును సమానకక్షిదారులే గాని అందేమియును భేదము లేదు. ఇట్టివీరి కన్యోన్యము సమానగౌరవమే యుండును గాని హెచ్చుదగ్గులుండవు. ఇట్లుండఁగా భీమకవి నన్నయభట్టుచే రచియింపఁ బడినభారతములో నేది వచియింపఁబడినదో అదియే తెలుఁగులోఁ జెప్పఁ బడవలయును గాని వేఱుపదము సూత్రసంపాదన లేమింజేసి చెప్పఁబడ గూడ దని నియమంబుఁ జేయుట కల్గునా ? ఆహా ! ఈయుక్తి యేమి యుక్తముగా నున్నది ? భీమకవి యంతయపండితుఁ డని అప్పకవి యూహించెంగాఁబోలును? నన్నయభట్టునకు ముందుగ ఛందమును రచియించినభీమకవి నన్నయభట్టీయమును గోదావరిలోఁ గలిపి మరల వ్యాకరణమును రచియింపలేక నన్నయభట్టారకుఁడు రచియించినభారతగ్రంథమును జూచుకోవలయు ననుట నియమంబుఁ జేసినవాఁ డనుటకంటె గొప్పవింత యేమైనఁ గలదా ! అంతటితోఁ బోనీయక "దక్ష