ఈ పుటను అచ్చుదిద్దలేదు

694

కవి జీవితములు.

వెన్నెలకంటివారి కాలనిర్ణయము.

విష్ణుపురాణము, విక్రమార్కచరిత్రము, కృష్ణవిలాస మను మూఁడుగ్రంథములలో వివరింపఁబడిన వెన్నెలకంటివారికాలము నాయా గ్రంథములలోని యాధారములంబట్టి చేసిననిర్ణయము ఎట్లన్నను :_

శా. స. మొదలు శా. స. వఱకు
1 సూరనసోమయాజి 1030 1080
2 ఇతనికొడుకు 1080 1130
3 ఇతనికొడుకు సిద్ధమంత్రి 1130 1180
4 ఇతనికొడుకు భాస్కరుఁడను సూర్యుడు, జన్న మంత్రియు, వీరిలో భాస్కరుఁ డనవేమారెడ్డిపేరఁ గృతుల నిచ్చె. 1180 1230
5 పైవారిలో జన్నయకుమారుఁడు సిద్ధమంత్రి 1230 1300
6 పైవారిలో భాస్కరుని మనుమఁ డగుసూరన్న [విష్ణుపురాణకవి] 1300 1350
7 ఈ సూరకవి కొడుకు వెన్నెలకంటి వీరిలో నొక్కక్కరికేఁబది సంవత్సరముల వంతున మువ్వురికిని నూటయేఁబది సంవత్సరములు 1350 + 150 = 1500
8 ఇతనికొడుకు చక్రప్ప వెన్నెలకంటి
9 ఇతనికొడుకు గంగయ్య వెన్నెలకంటి
10 ఇతనికొడుకు వెంగయ్య 1500 లకు బూర్వమును బరమందుఁగూడ నున్నాఁడు.
11 ఇతనికొడుకు రామమంత్రి 1500 1550
12 ఇతనికొడుకు జగ్గన 1550 1600
13. ఇతనికొడుకు వేంకటాచలపతి 1600 మొదలు 1650


24.

రామగిరి సింగనకవి.

(పద్మపురాణోత్తరఖండము)

ఇతఁడు పద్మపురాణోత్తరఖండమును వాసిష్ఠ రామాయణముం దెనిఁగించిన కవిశిఖామణి. నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. భారద్వాజగోత్రుఁడు భారతముఁ దెనిఁగించినతిక్కనసోమయాజి సంతతివారితో సంబంధి. ఇతఁడు భాగవతదశమస్కంధముఁగూడఁ దెనిఁగించితి నని తెల్పె. ఈపైరెండుగాథలను స్థిరపఱుచుపద్యముల వాసిష్ఠ రామాయణమునుండి యీక్రిందవి వరించెదము. అవి యెట్లనఁగా :_