ఈ పుటను అచ్చుదిద్దలేదు
694
కవి జీవితములు.
వెన్నెలకంటివారి కాలనిర్ణయము.
విష్ణుపురాణము, విక్రమార్కచరిత్రము, కృష్ణవిలాస మను మూఁడుగ్రంథములలో వివరింపఁబడిన వెన్నెలకంటివారికాలము నాయా గ్రంథములలోని యాధారములంబట్టి చేసిననిర్ణయము ఎట్లన్నను :_
శా. స. మొదలు | శా. స. వఱకు | ||
1 | సూరనసోమయాజి | 1030 | 1080 |
2 | ఇతనికొడుకు | 1080 | 1130 |
3 | ఇతనికొడుకు సిద్ధమంత్రి | 1130 | 1180 |
4 | ఇతనికొడుకు భాస్కరుఁడను సూర్యుడు, జన్న మంత్రియు, వీరిలో భాస్కరుఁ డనవేమారెడ్డిపేరఁ గృతుల నిచ్చె. | 1180 | 1230 |
5 | పైవారిలో జన్నయకుమారుఁడు సిద్ధమంత్రి | 1230 | 1300 |
6 | పైవారిలో భాస్కరుని మనుమఁ డగుసూరన్న [విష్ణుపురాణకవి] | 1300 | 1350 |
7 | ఈ సూరకవి కొడుకు వెన్నెలకంటి | వీరిలో నొక్కక్కరికేఁబది సంవత్సరముల వంతున మువ్వురికిని నూటయేఁబది సంవత్సరములు 1350 + 150 = 1500 | |
8 | ఇతనికొడుకు చక్రప్ప వెన్నెలకంటి | ||
9 | ఇతనికొడుకు గంగయ్య వెన్నెలకంటి | ||
10 | ఇతనికొడుకు వెంగయ్య | 1500 లకు బూర్వమును బరమందుఁగూడ నున్నాఁడు. | |
11 | ఇతనికొడుకు రామమంత్రి | 1500 | 1550 |
12 | ఇతనికొడుకు జగ్గన | 1550 | 1600 |
13. ఇతనికొడుకు వేంకటాచలపతి | 1600 మొదలు | 1650 |
24.
రామగిరి సింగనకవి.
(పద్మపురాణోత్తరఖండము)
ఇతఁడు పద్మపురాణోత్తరఖండమును వాసిష్ఠ రామాయణముం దెనిఁగించిన కవిశిఖామణి. నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. భారద్వాజగోత్రుఁడు భారతముఁ దెనిఁగించినతిక్కనసోమయాజి సంతతివారితో సంబంధి. ఇతఁడు భాగవతదశమస్కంధముఁగూడఁ దెనిఁగించితి నని తెల్పె. ఈపైరెండుగాథలను స్థిరపఱుచుపద్యముల వాసిష్ఠ రామాయణమునుండి యీక్రిందవి వరించెదము. అవి యెట్లనఁగా :_