ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

623

"1. గీ. వెలయ మఱియుఁ గల్గువీరమాహేశ్వరా, చారవరుల వీరసత్యవ్రతుల
        వీరసచ్చరితుల వీరవిక్రములను, పన్నుగదలంచి మ్రొక్కెద భక్తితోడ.

వ. తత్ప్రసాద కరుణావిశేష ప్రవర్ధమాన కవితామహత్త్వ సంపన్నుండ నైన మదీయాంతరంగంబున."

2. దీనిం బట్టి చూడ నీయంశము భాగవతరచనావిచక్షణుఁ డగు పోతనామాత్యుని కథవలె వ్రాయంబడక వేఱువిధంబుగ నున్నట్లు కాన్పించుచున్నది. అది స్పష్టముగా నందలియాశ్వాసాంతరగద్యములో నున్నది, ఎట్లన్నను :- "ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితాచిత్ర" అని పైగ్రంథకర్త యగుపోతయ వీరమహేశ్వరు లనుశైవభక్తులకరుణచేతఁ దనకుఁ గవిత్వప్రజ్ఞ గలిగినట్లు చెప్పును. వీరభద్రవిజయగ్రంథకర్త యగు పోతయ తా నాగ్రంథరచనాకారణ మొకచో నొక విధముగను, మఱియొకచో మఱియొకవిధంబుగను వ్రాసె. దానిని ముందుఁగఁ దెల్పెదను -

"వ. అయ్యవసరంబున సోమశేఖరుండు (ఇవటూరి సోమశేఖరుఁడు) ఇట్లనియె.

సీసగీతము. ఉన్న నైనను మాకెల్ల నూహలోన, వింతపండువు బోలెను వీరభద్ర
విజయ మెల్లను వినఁ గడు వేడ్క యయ్యె, నది తెలుంగున రచియింపుమభిమతముగ.

అ. పిన్న వాఁడ ననియుఁ బెక్కుసత్కృతులను, విననివాఁడ ననియు వెఱపు మాని
    మత్ప్రభావదివ్యమహిమచే నెంతైన, కవిత చెప్ప లావు గలదు నీకు.

వ. అదియునుంగాక నీకు వీరభద్రేశ్వరప్రసాదంబు గలదు."

అని యిట్లు తామొదట నొకచోటవ్రాసి వీ. వి. లోఁ బోతయ కవి స్వవంశమును వర్ణించి తిరుగ మఱియొకపరి స్వసామర్థ్యంబును, గ్రంథరచణాకారణంబు నీక్రిందివిధంబుగ వ్రాసెను. ఎట్లన్నను :-

"వ. తదనుజుండ నై నేను జన్మించిపోతయనామధేయుండ నై పరఁగి జనకశిక్షితవిహితాభ్యాసుండ నై వీరభద్రప్రసాదలబ్ధ కవితాతిశయంబున.

ఉ. భాగవతప్రబంధ మతిభాసురతన్ రచియింప దక్షకృ
    ద్యాగకథాప్రసంగమున నల్పవచుస్కుఁడ నైతిఁ దన్నిమి
    త్తాగమవక్త్రదోష పరిహారతకై యజ నైక శైవశా
    స్త్రాగమ వీరభద్రవిజయంబు రచించెద వేడ్క నామదిన్."