ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

589

లపైఁ గృతులిచ్చియుండిరి. కాఁబట్టి వారు కేవలము దక్షిణదేశకవులే కాక చోళ పాండ్యదేశాంధ్ర కవులని కూడఁ జెప్పఁదగియుందురు. ఇట్టి వారి గాథలు చాలభాగము కవికావ్యప్రశంసాచంద్రికలోఁ జూడఁదగు నని చెప్పి యీనావిజ్ఞాపన నిల్పెదను.

____________

శ్రీరస్తు.

కవిజీవితములు.

పురాణకవులచరిత్రము.

20.

బమ్మెర పోతరాజు

ఈ భాగములోఁ బురాణముల నాంధ్రీకరించిన కవులచారిత్రము లుండును. వారిలోఁ బ్రధానుఁడు భాగవతపురాణముం దెనిగించిన బమ్మెరపోతనామాత్యుఁడు. అదియునుగాక అతనికాలము పురాణకవనమునకును ప్రబంధకవనంబునకును నడిమి దగు 'కావ్యరచనా కాలమగుటచేతఁ బ్రాచీనగ్రంథమునకంటె ననఁగా సంస్కృతమాతృకాగ్రంథమునకంటె వర్ణ నాంశములో వేదాంతభాగములోఁ బెంచి యీభాగవతపురాణముఁ బ్రకటించెను. ఇట్టిగ్రంథరచనాప్రధానుఁ డగుపోతనామాత్యునిచారిత్రముఁ బ్రథమములోఁ గైకొనుచున్నారము. ఇతనివలెనే భాగవతకథావిశేషంబులఁ దెనిఁగించుటలో నతిసమర్థుఁడును, అద్వైతశాస్త్రప్రధానం బగువసిష్ఠరామాయణ పద్మపురాణోత్తరభాగాది గ్రంథములఁ దెనిఁగించిన 'మడికిసింగన' యొక్కయుఁ జారిత్రము తెలిసిన వఱకు వెల్లడింపఁబడును. వీరితో నించుమించుగా సరితూఁగు విష్ణుపురాణగ్రంథకర్త యగు 'వెన్నెలకంటి సూరన' అను నతని చరిత్రమును