ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

571

కలుగకపోవు నని యీవఱకే నేను వ్రాసియున్నాఁడను. కావున దీనికి వేఱుగ సమాధానము చెప్పనక్కఱ యుండదు.

2. పూ. పెద్దబట్టుచేసిన వ్యాఖ్యానములును, పుష్పగిరి తిమ్మన కృతం బగు దశావతారచరిత్రయు నుత్తర రామాయణంబును లోకములో నొకరుచేసి మఱియొకరు పేరు పెట్టుటకు దృష్టాంతము లని యిట్టిపనులు సర్వసాధారణములుగా నున్న వని.

2. న. ఈ పైరెండుపుక్కిటిపురాణములకును గ్రంథ దృష్టాంతములు లేవు. పెద్దిభట్టు అనునది వేఱనుకొనుట భ్రమ. లోకములో నబ్బిశాస్త్రి యని, పిల్లావుధాను లని, బొఱ్ఱబాబు అని, బంగారు అబ్బాయి, అని కొన్ని బాల్య కాలనామంబులు వ్యాపకములో నుండుట గలదు. ఆపేరులు గలవారికి వేఱునామంబులు లే వని యూహించుట లోకానుభవము లేకుండుటం దెల్పును. పెద్దభట్టనునది బాల్యనామము. ఆనామముతో నొప్పునతనిపేరు మల్లినాథుఁడు. వారి యింటిపేరు కొలిచెలమల (కోలాచలము) వారు. అతని కేమహామహోపాధ్యాయుఁ డని బిరుదు కలదు. పెద్దిభట్టు చేసినాఁ డని చెప్పెడు వ్యాఖ్యానగ్రంథము లన్నిటిలో నిట్లె యున్నదిగాని ఇది పెద్దిభట్ట విరచిత మని లేదు. పుక్కిటి పురాణముల నమ్మిన నింతకంటెను బ్రమాదములు గలుగఁగలవు కావున గ్రంథస్థగాథల నమ్ముటకు నుపన్యాసకుం బ్రార్థించెదను. ఇఁక పుష్పగిరితిమ్మన్న దశావతార చరిత్రము చేసి యొకరిపేరిట, నుత్తర రామాయణముచేసి మఱియొకరిపేరిటను బ్రకటించె ననుదానికిఁగూడ వ్రాఁతమూలము లైనయాధారములు లేవు. ఇంతియకాక కంకంటిపాపరాజు చేసినయుత్తరరామాయణములో నిట్టిసందేహము నివారింపఁబడినది. అందులోఁ గంకంటిపాపరాజు తాను గ్రంథము చేయదొరకాని తనమిత్రుఁడును సహాధ్యాయుఁడు నగుపుష్పగిరితిమ్మన్నయొక్క సహాయము నంది తనగ్రంథము రచియించినట్లుగాఁ జెప్పె. ఆపద్య మెట్లున్న దన :-

"తే. అని కిరీటికి శౌరి తోడైనయటుల, నమ్మహాకవి సాహాయ్య మాచరింపఁ
     గృతి నొనర్పగఁ బూనినయేను మొదట, నెంతు మద్వంశవిధ మది యెట్టు లనిన."