ఈ పుటను అచ్చుదిద్దలేదు

482

కవి జీవితములు.

గీ. వానివంశంబు తుళువాన్వ వాయమయ్యె, నందుఁబెక్కండ్రునృపులుదయంబునంది
    నిఖిలభువనప్రపూర్ణనిర్ణిద్రకీర్తి, నధికు లైరి తదీయాన్వయమునఁ బుట్టి."
                                                                              మనుచరిత్రము.

ఇట్టివారిలో మొదటివాఁడు తిమ్మరాజు. ఇతనింగూర్చినకథ పారిజాతాపహరణములోమాత్రము చెప్పఁబడలేదుగాని మనుచరిత్రము లో నతని విశేషములు వ్రాయఁబడినవి. ఎట్లన్నను :-

"మహాస్రగ్ధర. ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి శఠకమఠగ్రావసంఘాతవాతా
                శనరాడాశాందంతితస్థవిరకిరులజంఝాటము ల్మాన్పి యిమ్మే
                దిని దోర్దండైకపీఠిం దిరముపఱచి కీర్తిద్యుతుల్ రోదసిం బ
                ర్వ నరాతుల్ నమ్రులై పార్శ్వముల నిలువ తీవ్రప్రతాపంబు సూ పెన్.

క. వితరణఖని యాతిమ్మ, క్షితిపగ్రామణికి దేవకీదేవికి సం
    చితమూర్తి యీశ్వరప్రభుఁ, డతిపుణ్యుఁడు పుట్టె సజ్జనావనపరుఁ డై."

ఈ ఈశ్వరరాజుంగూర్చి పైరెండు గ్రంథములలోఁగూడ వివరింపఁబడియున్నది. అందు పారిజాతాపహరణములో

"ఉ. రాజులనెత్తుటం బరశురాముఁడు వ్రంతలు చేసె రెండుమూఁ
      డీజగతిం గణింప నది యెంతటి విస్మయ మబ్జినీసుహృ
      త్తేజుఁడు కందుకూరికడఁ దిమ్మయయీశ్వరుచే జనించె ఘో
      రాజి బెడందకోట యవ నాశ్వికరక్తనదీసహస్రముల్."

అనుదానివలన నీయీశ్వరరాజు కందుకూరి సమీపములో బెడఁదకోట తురుష్కులం జయించె నని మాత్రము చెప్పంబడినది. మనచరిత్రములో నీతనివిజయవిశేషములు చెప్పంబడకపోయిన ననేకులగు రాజులవలనఁ గప్పంబులు మొదలగునవి గ్రహింపఁబడినట్లును, శత్రుజయము చేసినట్లుగా రెండుపద్యములు చెప్పఁబడినవి. ఎట్లన్నను :-

"చ. బలమదమత్తదుష్టపురభంజనుఁ డై పరిపాలితార్యుఁ డై
      యిలపయిఁ దొంటియీశ్వరుఁడె యీశ్వరుఁ డై జనియింప రూప ఱెన్
      జలరుహ నేత్రలం దొఱఁగి శైలవనంబుల భీతచిత్తులై
      మెలగెడుశత్రుభూవరుల మేనులఁ దాల్చినమన్మథాంకముల్.

సీ. నిజభుజాశ్రితధారుణీవజ్రకవచంబు, దుష్టభుజం గాహితుండికుండు
    వనజేక్షణామనోదనపశ్తతో హరుం, డరిహంససంసదభ్రాగమంబు