ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిష్టు కృష్ణమూర్తి కవి.

447

ల్వారుల జేరుదారు దళవాయుల చాయలమీఱుచారుకై
జారుకరారుబాఁకునెలజాలుతళుక్కునబందుబస్తుగా
పోరుభుజోరుకాకరలపూఁడివజీరు లదే యన న్మహో
దారులు పూర్ణనిర్మల సుధాకరకాంతికలాపకీర్తివి
స్తారులు భూరిభూసుర వితానమహాహుతిగంధగౌతమీ
తీరనిసర్గ దుర్గపుర దీపితహర్మ్యతలాగ్రభాగసం
చారులు దేవవారవనజాతముఖీసమవారకామినీ
వారక రాబ్జకీలితసువర్ణమణిద్యుతిదండచామర
ప్రేరితవాతధూతనవఫేనసమానవితానమంగళా
కారసువర్ణపీఠపరికల్పితరాజ్యరమామహామహో
దారులు సేతుశీతవసుధాధరమధ్యతలస్ఫురల్ల స
ద్వీరవిశేషసంజనితతీవ్రదవానలబాడబాగ్నిత
త్వారినృపాలజాలమకుటార్పితపాదపయోధిపీఠసం
స్కారులు రామచంద్రపురసాలనివాసులు రామచంద్రవం
దారులు రామచంద్రవసుధావరపౌత్త్రులు రామచంద్రధా
త్రీరమణాభిధానులు వరిష్ఠవసిష్ఠసగోత్రపావనుల్
కారణజన్ము లబ్ధిశశికల్పకమేఘసమాన గానదీ
క్షారతు లిందిరాసుత జయంత వసంత సమాన సుందరా
కారులు బ్రహ్మకల్పము సుఖంబుగ వర్ధిలువార లీధరన్."

ఈ పద్యము విశాఖపట్టణముజిల్లా వేముపాడు గ్రామకాఁపురస్థుఁడు గుంటూరి పెద్దకవివలనఁ జెప్పఁబడిన ట్లాజిల్లాలోఁ బ్రసిద్ధి గలదు.

కాళహస్తి ప్రభునిపైఁ జెప్పినపద్యము.

ఉ. దామెరవేంకటక్షితిప తావకపాండురకీర్తిదీధితి
    స్తోమము లిందుభా స్తతులతో నెదిరించి తృణీకరింబె నౌ
    గాములకేమి యోజనలుకాని యశంబులు మేయు శంబరం
    బేమరకుబ్బుమీఱ వసియించునె డాపి తదంతరంబునన్

వైణికజనోపయోగిగాఁ జెప్పినయుత్పలమాలికావృత్తములు.

"ఉ. ఏయెడనో యదెక్కడనొ యెవ్వరియొద్దనొ యెందు కెందుకో
      చేయది నేర్చి యున్న యది చెల్లునె వీణె యనంగఁ గొండలన్
      గోయలు దండివచ్చు మెఱుఁగుం బచరించినయట్లుగాక నో