ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

369

గ్రంథములోఁ గానుపించనివానిఁ గుఱించి విమర్శకులు పట్టిపల్లార్చవలసిన పని యుండదు.

ఇఁక తెనాలిరామకృష్ణునిగాథలు నుడువుచో లోకములో వాడుకొనంబడుచున్నకొన్నివృత్తాంతములు వ్రాయఁబడినవి. వానిలోఁ గూడ సాధ్యము లగునన్ని యంశములు యుక్తిచేతను, గ్రంథదృష్టాంతరములచేతను యథార్థబోధమునకై వ్రాయంబడుచుండెను. అట్టివానిలో లోపము లున్న యెడల వానిం దెల్పి గ్రంథము సవరణ చేయించుటకుగా నీవఱలో నాంధ్రపండితు లందఱు ప్రార్థింపఁబడియున్నారు. అందులో నీ రా. కృ. గారు నొక్కరు కావచ్చు నని యూహించియుంటిని. కాని వారు నీపైవిషయమును నవీనముగాఁ గనిపెట్టియే యుందురు. ఆవిషయములో నైన తాము వ్రాయుచున్న హరిశ్చంద్ర నలోపాఖ్యానకవిచరిత్రము నాగ్రంథముకంటె నాధిక్యత నందఁ గల దని యూహించి దానిని లోపలనే జీర్ణింపఁ జేసి యుంచియుందురు. అటు గాకున్న నీకవిజీవితము ఆ 1877-78 సంవత్సరములలోఁ బ్రకటింపఁ బడినది. అది మొదలు 1892 సంవత్సరమువఱకు నీవిశేషమును ప్రకటింపకపోవుటకుఁ గారణము కానుపించదు. ఇట్టిగొప్పవృత్తాంతము నెంతవిస్పష్టముగాఁ బ్రకటించిన నంతచారిత్రానుభవశక్తి వెల్లడి యగునని యెంచి కాఁబోలు పైయిర్వురుమూర్తులు నొకరు కా రని చెప్పినఁ జాల దని యూహించి ఆయిర్వురి వర్గత్రయములోఁ గలభేదము నీక్రిందివిధంబున వ్యక్తీకరించిరి.

"అల్లసానివాని అనునది కాకమానిమూర్తిని గుఱించి చెప్పఁబడినపద్యము. దీని లోకులు భట్టుమూర్తి కన్వయించి చెప్పుట యెంత హాస్యాస్పదముగా నున్నదో విచారింపుఁడు. భట్టుమూర్తిగారియింటి పేరు కాకమానివా రని యాతనిమెడఁ గట్టిరి. గమనించి చూడుఁడు.

1. కాకమానిమూర్తి కౌండిన్యసగోత్రుఁ డైనబ్రాహ్మణుఁడు = బట్టుమూర్తి బట్టు వంశజుఁ డైనశూద్రుఁడు.

2. కాకమానిమూర్తి బుధకవిసార్వభౌమపౌత్త్రుఁడు = బట్టుమూర్తి తిమ్మరాజు పౌత్త్రుఁడు.

3. కాకమానిమూర్తి రామలింగభట్టుపుత్త్రుఁడు = బట్టుమూర్తి వేంకటరాయభూషణపుత్త్రుఁడు.