ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

కవి జీవితములు

కవిత్వవిశేషములం జెప్పినపద్యములోఁ గాని యీవిశేషణము చెప్పంబడకుండుటంజేసియు, నిష్పక్షపాతబుద్ధితో నెవ్వరును జెప్పఁజాలరు.

ఇట్లు వసుచరిత్రము, నరసభూపాలీయము ఈకృతియుగంబులోఁ గాన్పించినగ్రంథకర్తల కవితావిశేషంబులం జూపియున్నను రామోపాసనావిషయమై చెప్పవలసినవిశేషములు చెప్పకయే యితరాంశముల వ్రాయ వలనుపడదు. కాన దానిని ముందుగ నిట వివరించెదను.

వసుచరిత్రములో మొట్టమొదటి పద్యము.

శా. శ్రీభూపుత్రి వివాహవేళ నిజమంజీరాగ్రరత్నస్వలీ
     లాభివ్యక్తి వరాంఘ్రిరేణుభవక న్యాలీల యంచున్ మదిన్
     దా భావింప శుభక్రమాకలనచేఁ దద్రత్నముం గప్పుసీ
     తా భామాపతి బ్రోవుతన్ దిరుమలేంద్రశ్రీమహారాయనిన్.

అని స్వేష్టదేవతానతిపూర్వకముగాఁ గృతిపతి నాశీర్వదించి కవివలనఁ బైపద్యము చెప్పంబడియెను. ఇటులనే కావ్యప్రబంధకవులందఱు స్వేష్టదేవతానతి చేసి యొకరికి కృతి యిచ్చుట సర్వత్ర విదితవృత్తాంతమే. కొంద ఱొకకృతి దేవునకే యియ్యఁదలఁచుకొనినయెడలఁ గృతి కధీశ్వరుం డగుదేవుని స్తుతియించి అనంతర మిష్టదేవతను నుతియించుటయుంగూడఁ గలదు. కాని నరాంకిత కృతులందుఁ గవియొక్క యిష్టదేవతానమస్కారమే తఱుచుగాఁ గాన్పించును. వసుచరిత్రములోనే కృతిపతి తన్నుం బిలువనంపె నని చెప్పినసందర్భములోఁగూడ నను శ్రీరామపాదార విందభజనానందున్ అని విస్పష్టముగా వివరింపఁబడియున్నది. దీనినే స్థిరపఱుచుటకును, బలపఱుచుటకును హరిశ్చంద్రనలోపాఖ్యానములో మఱియును బుంఖానుపుంఖముగా శ్రీరామవర్ణనమును, తనకు శ్రీరామునియెడఁ గలభక్తి చూపుటకుఁగాను దాఁ జేసినకార్యాదికములంగూడఁ దెల్పె. అందుఁ గొన్నిటి నిట వివరించెదను :-

హరిశ్చంద్రనళోపాఖ్యానము. ప్రథమాశ్వాసము

కృతిముఖపద్యము.

శా. శ్రీవైదేహసుతన్ భృగూద్వహజయశ్రీనబ్జభృచ్చాపలీ
    లావాప్తిన్వరియించిసత్కుశలవత్వామూల్యమాంగల్యదీ