ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

కవి జీవితములు

గము లనఁగా సేనాధిపత్యములును మంత్రిత్వములును నలుబదియేఁబది సంవత్సరములు గడచినవారికిఁ గాని లభియించెడు నాచారము లేదు. కాఁబట్టి పై కథలో సూరకవి సదాశివరాయల కాలములోనివాఁ డనుట కేమాత్రము చాలియుండ లేదు.
(9) ఈ విషయమునే రాఘవపాండవీయములోని కృతిపతివంశాను వర్ణనమునుండియు నొక విధముగా నూహింపనై యున్నది. ఈగ్రంథము కర్నూలుమండలములోని ఆకువీడుసంస్థానాధిపతి యైన పెదవేంకటాద్రి కంకితము చేయఁబడినది. ఈ వేంకటాద్రికి తాత యైనయిమ్మరాజు రాజమహేంద్రవరమును జయించిన ట్లున్నది. రాఘవపాండవీయ కృతిపతితాత యగుతిమ్మరాజును, కళాపూర్ణోదయకృతిపతితాత యగునారపరాజును కృష్ణదేవరాయని కాలములో నాతనికి లోఁబడినసామంతరాజు లై యుండి అతనితోఁ గలసి సేనాధిపతులుగా మహమ్మదీయులతో యుద్ధములు చేసి రని తెలియవచ్చుచున్నది. 1515 - 77 (శా. స. 1435) సంవత్సరము నందు కృష్ణరాయలు రాజమహేంద్రవరమును జయించెను. కాఁబట్టి (9) రాఘవ పాండవీయములోని యీగాథలవలన నిమ్మరాజు కృష్ణరాయల సేనానిగా కనుపడదు. అందు,

క. రాజమహేంద్రవరాధిపు
   రీజైత్రవిచిత్రములఁ బరిభ్రాజితుఁ డై,
   యాజిఘనుండాయిమ్మమ
   హీజానిప్రసిద్ధిఁగాంచెవెంతయుమహిమన్

అనియున్నది. దీనింబట్టి యీ యిమ్మరాజు స్వయముగనే రాజమహేంద్రవరమును జయించినట్లు కాన్పించును. కృష్ణదేవరాయనివంటి రాజాధిరాజునకు సహాయులుగా నుండినయితరసామంత ప్రభువులను వర్ణించుచో నతని ప్రభునిపేరు వక్కాణింపకుండుట యుండదు. అది యెంతమాత్రము లేదు. కావున నీగాథ విశ్వసనీయము కాదు. దీనిం బట్టి సూరనకవి కాలనిర్ణయము జేయ ననువుపడదు.