ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

307

(7) పైఅంశములోని రంగరాజు అనునది ప్రమాదజనిత మేమో? నంద్యాల కృష్ణమరాజు వేంకటపతిరాయల రాజ్యారంభదశలోను జీవించి యున్నాఁడఁట. అందుచేత నతఁడు 1585 సంవత్సరమునకుఁ దరువాత గూడ నల్ప కాలము రాజ్యమేలి యుండును. (7) రంగరాజు పేరు ప్రమాదజనితమే కావచ్చును. కాకపోవచ్చును. అది ప్రస్తుతము మనకథకు సంబంధింపదు. నంద్యాలకృష్ణమరాజు వెంకటపతిరాయల రాజ్యారంభదశలో రాజ్యము చేయుచుండిన నంతవఱకును సూరకవి బ్రతికియున్నాఁ డని చెప్పుట కది చాలదుగదా.
(8) కళాపూర్ణోదయములోఁ గృష్ణమరాజుతాత యయిననార పరాజు కుతుబ్ ముల్కును కొండవీటి యొద్ద నోడించిన ట్లున్నది. ఈకుతుబ్ ముల్కు గోలకొండలో కుతుబ్‌షారాజవంశమును స్థాపించెను. ఇతఁడు క్రీ. శ. 1512 - 77 = (1435 శా. స.) మొదలు 1543 - 77 = (శా. స. 1466) వఱకును గోలకొండ యందు రాజ్యము చేసెను. కృష్ణదేవరాయని కాలములోఁ గొండవీటి దగ్గఱ జరిగినపైయుద్ధము క్రీ. శ. 1512 - 77 శా. శ. 1435 (సంవత్సరమం దనుటచేత నాతనితో యుద్ధము చేసిఅనారపరాజు మనమఁడైన కృష్ణమరాజు తర్వాతను ముప్పదినలువది సంవత్సరములకు రాజ్యము చేసె ననుట సత్యమునకు దూరమై యుండదు. కాఁబట్టి దీనింబట్టియు సూరకవి 1520 స. ప్రాంతముననున్నట్లు నిశ్చయించవలసియున్నది (8) ఇది నిజమైనగాధయే కావచ్చును. ఇదియును సూరకవికాలనిర్ణయము చేయుటకుఁ జాలియుండదు. నారపరాజునకు నిరువది సంవత్సరముల లోపున కొమారుఁడును నలువది సంవత్సరములలోపున ఆకుమారునివలన మనుమఁడును గలిగి యుండవచ్చును. ఆమనుమడు తన యిరువదియవసంవత్సరమునఁ గళాపూర్ణోదయము కృతినందిన నప్పటికి నారపరాజునకు 54 సంవత్సరము లుండవచ్చును

అప్పుడు నారపరాజు యుద్ధములోనికిం బోవచ్చును. నారపరాజుతో సమానవయస్కుఁ డగుసూరకవి నారపరాజు మనుమనిపేర కృతియు నిచ్చియుండ వచ్చును. కావున నిదియును సూరకవికాలమును కృష్ణరాయలకాలమును కా దని నిశ్చయించుటకుఁ జాలి యుండదు. పూర్వకాలములో గొప్ప యుద్యో