ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

కవి జీవితములు

ఆంధ్రకవిచరిత్రాంశములు. పూర్వపక్షములు.
(1) కృష్ణదేవరాయని యాస్థాన కవీశ్వరులలో నీసూరనకవి యొక్కఁ డని కొందఱు చెప్పుదురుగాని అతఁ డాకాలమునందు గాని ఆసంస్థానమునందు గాని యున్నట్లు నిదర్శనము లేమియుఁ గానరావు. ఈసూరకవి పదునాఱవ శతాబ్ద మధ్యమున నున్న ట్లూహించుట కనేకనిదర్శనములు కనఁ బడుచున్నవి. (1) ఏసంస్థానము లోనైనను అందుండు కవీశ్వరు లందఱును ఆసంస్థానాధిపునిపైకృతి నిచ్చునాచారము లేదు. పూర్వకాలములో ముసలి వారుగా నుండుకవీశ్వరులే కృతి యిచ్చునాచారము కాన్చించును. సూరనకంటె ముసలికవు లిర్వురు మాత్రమే కృష్ణరాయలను మనుచరిత్ర పారిజాతాపహరణ గ్రంథములకుఁ గృతి పతిం జేసిరి. అంతమాత్రమునఁ గృష్ణరాయని యాస్థానములోనిఁక యితరకవులు లే రని చెప్పఁగాఁ గృష్ణరాయల సంస్థానములో ననేకులు కవులుండి రనుజగద్వ్యాపకమగుప్రతీతి యంతయు నబద్దము కావలసి వచ్చును. పైగ్రంథకర్త లిర్వురు గాక కృష్ణరాయలసభలో కవులుగా నున్న యితరు లెవ్వ రని యొకశంక జేసి యుంచెదము.
(2) సూరనకవి కళాపూర్ణోదయమును నంద్యాలసంస్థానాధిపతియు నార్వీటి బుక్కరాజు సంతతిలో నతని కాఱవ పురుషుఁ డగుకృష్ణరాయలకుఁ గృతి యిచ్చె ననియు, నార్వీటిబుక్కరాజు కాలము క్రీ. శ 1473-77 (శా. స. 1396) మొదట క్రీ. శ. 1481-77 శా. స. 1404 వఱకును రాజ్యము చేసెననియును, అతనిపిమ్మట రాజ్యము చేసిన యతని సంతతిలోని నల్గురు రాజులకును పురుషున కిరువది (20 years) సంవత్సరముల వంతున లెక్కింపఁగా వారిపిమ్మట రాజ్యమునకు వచ్చిన కృష్ణరాయలు క్రీ. శ. 1560-77 శా. స. 1483 ప్రాంతమున నున్న ట్లెంచవలయును. (2) ఈ ప్రశ్నమునకు సమాధానము చెప్పుటకుఁ బూర్వము విజయనగరమున నధికారము చేసిన ముఖ్యు లగుప్రభువులకాలనిర్ణయము చేయవలసియున్నది. అది యిదివఱకే ప్రభుత్వమువారివలన శాసనాదికముల సహాయమున నిర్ధారణచేయఁబడియుండెఁ గావున నందులోని ముఖ్యాంశముల నీక్రింద వివరించెదను. (see R. Swell's lists Antiquities of the Southern India Vol II) ఎట్లన్నను :-

బుక్కరాజు No 1. - క్రీ. శ 1300 - 77 = 1223 శా. స.

బుక్కరాజు No 2. - 1354 - 77 = 1277 శా. స.

బుక్కరాజు No 3 - క్రీ. శ. 1369 - 77 = 1292 శా. స.

కృష్ణరాయలు - 1509 - 77 = 1432 మొదలు 1530 - 77 = 1453

సదాశివరాయలు - 1542 - 77 = 1465 మొదలు 1563 - 77 = 1486

తిరుమలదేవరాయలు - 1567 - 77 = 1490 మొదలు 1577 - 77 = 1500

శ్రీరంగరాజు - 1572 - 77 = 1495 మొదలు 1584 - 77 = 1507

వేంకటపతిరాజు - 1585 - 77 = 1508 మొదలు 1614 - 77 = 1537