ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

289

ఆపద్య మెట్టిదనిన :-

"ఉ. భోరున యాచకప్రతతిబుద్ధి విపజ్జలరాశిఁ గ్రుంగఁగా
      నారయ శాలివాహనశకాబ్దము లద్రి, గజాగ్ని, సోములన్
      దారణనామవత్సరనిదాఘదినంబున జ్యేష్ఠశుద్ధష
      ష్ఠీరవివాసరంబున నృసింహునికృష్ణుఁడు నస్తమిల్లె నా
      ద్వారక నున్న కృష్ణుఁ డవతారసమాప్తము నందు కైవడిన్."

పైపద్యమునందు వివరింపఁబడిన కాలము :-

అద్రి = 7, గజ = 8. అగ్ని = 3. సోమ = 1. అనఁగా "అంకానాం వామతో గతిః" అను సూత్రముంబట్టి 1387 అయినది.

దీనిని రూఢిపఱుచునట్టికృష్ణరాయకృతభూదానశాసనములు గలవు. అందు శా. స. 1332 స్వభానుసంవత్సరమున అత్తోటపాటిలోఁ గొంతభూమి విడఁదీసి దానికిఁ గంచవర మనునామ ముంచి, అగస్త్యేశ్వరస్వామికి నిత్యదీపారాధన ఖర్చులకు "కుంచే అమ్మసాని" అనువేశ్యవశమున నిచ్చె నని యున్నది.

అటుపిమ్మట దేశము నశ్వపతు లేలి రనియును, అనంతరము సదాశివరాయ లేలినకాలములో ననఁగా శా. స. 1465 అగుశోభకృతు సంవత్సరములో చిలకమర్తి వల్లభాచార్యులకు "గోవాడ" అనుగ్రామ మిచ్చినట్లును, శా. స. 1467 మునకు సరియైన విశ్వావసుసంవత్సరములో కందాళ్ల అయ్యవార్లంగారికి అనుమర్లపూడి గ్రామము నిచ్చె ననియుం జెప్పి యున్నది. ఇట్లుగా వివరింపఁబడినపేరు లన్నియును, నసంగతము లని యెంచి కృష్ణరాయ నిర్యాణపద్యమును "ఆంధ్రకవిచరిత్రము"లో వలెనే శాలివాహన శతాబ్దమును పదునేనవశతాబ్దముగా సవరించుటకంటె నిట్టిభేదము లుండుట కేమైనను గారణము లుండునా? అని యూహించుట న్యాయమై యుండును. అట్టిసంవాదము కృష్ణరాయ చరిత్రములోఁ జేయవలసిన దగుటంజేసి దాని నిచ్చో వివరింప మానినాఁడను. కాని యీ చరిత్రము చదివినపిమ్మట శ్రీనాథకవికాల