ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కవి జీవితములు

దాని నీక్రిందివిధంబున శ్రీనాథుఁడు పూర్తిచేసెను. ఎట్లన్నను :-

ఉ. తక్కక రావుసింగవసుధావరుఁ డర్థుల కర్థ మియ్య నే
    దిక్కున లేనికర్ణుని, దధీచిని, ఖేచరు, వేల్పు చెట్టుఁ, బెం
    పెక్కినకామధేనువు, శిబీంద్రుని వేఁడఁగ నేల యాచకా
    కుక్కవొ, నక్కవో, పులివొ, కోఁతివొ, పిల్లివొ, భూతపిల్లివో.

అని యిట్లు సమస్యాపూరణముం జేసియున్నశ్రీనాథుని సింగభూపుఁడు మహాకవిగఁ దెలిసికొని సగౌరవంబుగా నతనికోర్కె యడిగినఁ దనప్రభునికోర్కె యతఁడు దెల్పె. దానిం జేసి శ్రీనాథుం బంప నతఁడు తనప్రభుం డగు వేమనృపాలుకడకు వచ్చి సర్వజ్ఞసింగమనీనిఁ దా నలరించి వచ్చితి నని చెప్పెను. అపుడు వేమనృపాలుఁడు సర్వజ్ఞునిసభలో జరిగినవిశేషములు తెల్పు మనఁగా శ్రీనాథుఁడు వాని నన్నిటిని సవిస్తరముగాఁ జెప్పును. వేమభూపాలుఁడు తనవిరోధి యగుసింగమనీని సర్వజ్ఞు డని వర్ణింపగా మేము నట్టిబిరుదున కంగీకరించిన ట్లుండును గదా. కార్యార్థమై నిన్ను బంపియుంటిమి గాని నిజముగ నతని వర్ణించి యతనివలన బహుమాన మంది రాఁ బంపలేదే. నీ వెట్లుగ నతని సర్వజ్ఞుఁ డని నుతియించితివి నీలౌకికప్రజ్ఞకు లోప మాపాదించితి వని యధిక్షేపించెను. అట్టిపల్కులకు శ్రీనాథుఁడు నవ్వి నే నీవలనం బ్రేరేపింపఁబడి యచ్చటికిం బోయి యున్నచో నీ కవమానకర మగుపనిం జేసివత్తునా? అటుల నొనరింప లేదు. నేను యథార్థముం జెప్పినదానిని సర్వజ్ఞుఁడును నాతనియాస్థానపండితులును గ్రహింపలేక వారిసర్వజ్ఞత్వమును వారే పోఁగొట్టుకొనిరి. అనుడు సర్వజ్ఞుఁ డనుపద్యమున కేమియర్థము చెప్పితి వనుడు నాపద్యమునే మఱియొక విధంబునఁ జదివి చెప్పెను. ఎట్లన్నను :

క. సర్వజ్ఞ నామధేయము, శర్వునకే రావుసింగజనపాలున కే
    యుర్విం జెల్లును ? నితరుని, సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే.

ఇ ట్లర్థము భేదించుటయే గాక రెండవపక్షములో దూషణము గూడఁ గన్పించునట్లు చదువుటకు వేమారెడ్డి యెంతయు సంతసించెను.

పైని వేమారెడ్డి సర్వజ్ఞునితో నొక కార్యము గల్గి శ్రీనాథునిఁ దత్కార్యార్థము పంపినట్లు చెప్పియుంటిమి. అట్టికార్య మతినీచకార్య