ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కవి జీవితములు



తనయింట నుంచి కృష్ణ రాయలు వచ్చినతఱి మాటలమధ్యను దనపిన తల్లికూఁతురు తన్ను జూడ వచ్చిన దనియును అది తనయింట నుండు వఱకును దనకై యతఁడు తఱుచుగ వచ్చిన బాగుగనుండదనియును జెప్పినది. ఆమాటలు వినినతోడనే కృష్ణరాయని కాచిన్న దానిఁ జూచువేడుక యధిక మయ్యెను. కావున నాఁడు మొదలు తనభార్యం జూచునెపమున వేళగానివేళల వచ్చి తనమఱఁదలిఁ జూచి కొంచెముగా సంభాషింప నారంభించెను. దాని కతనిభార్యయు నర్థాంగీకారముగా నూరకుండుటకు సంతసించి యొకనాఁడు తనభార్యతోఁ దా నభ్యంజనముకాఁ గోరెద ననియును, తనమఱఁదలు తనభార్యయును దనకు రాణివాసంబుననే యభ్యంజన స్నా నాదికమును జేయింపవలయు ననియును దెల్పెను. దాని కాతనిభార్య సమ్మతింపక యనేకాటంకములు కలిగించినది. దాని కతఁడు కోపింపక యా పెను మిగులఁ బ్రార్థించిన నపు డాపె తా నేమియు ననలేనట్లుగ నభినయించి, మఱఁదలితో మాటలాడక దానిం గన్నెత్తి చూడకుండినచో నది వచ్చు ననియుఁ బల్కినది. దానికిఁ గృష్ణరాయుఁడు సమ్మతించి యభ్యంజనము చేయించుకొన నారంభించెను. తిరుమల దేవియును నదియ తనయభీష్టసిద్ధికిం దగినతఱి యనియెంచి యేదియో పని యున్నట్లుగా లోనికిం బోయి యొక తెరచాటున నొదిగి నిల్చి యుండెను అదియ యనుకూలసమయ మని కృష్ణరాయఁడు తనమఱఁదలి యొంటిపైఁ జెయి వేసెను.

తోడనే యాచిన్నదియును నొక కేక వేసి "మాయక్కతోఁ జెప్పెద నని పరుగిడఁ దొడంగినది కృష్ణరాయఁడు తత్తరమున నాబిత్తరి పాదములు పట్టుకొని లోనికిం బోవల దనియును, నావృత్తాంత మొరులకుం జెప్పవల దనియును బతిమాలుచుఁ దనచేతిభద్రముద్రికం దీసి దానిచేత నుంచి నీ కిది బహుమాన మిచ్చితి నని తెల్పెను. ఇట్టివృత్తాంతము రహస్యముగ లోపలనుండి చూచు చున్న తిరుమల దేవి కెంతయు సంతసము కల్పింపఁ దాను రాజుం జూచుసమయం బదియ యని యే