ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

7

అని యిట్లు శాపం బుంచి యాపద్యం బారాజుకడకుం బంచి భీమన తాను యథేచ్ఛం జనియెను. అ రాజకుమారుఁడు భీమనశాపంబు సరకుగొనకున్న నేఁడవనాఁటికే మృతి నొందెనఁట ఇట్లు కాలవశుం డైనయారాజుయొక్కబంధువు లతనికి నగ్ని సంస్కారంబు గావించుటకు శ్మశానవాటికకుఁ గొనిపోయిన నాతనిభార్య లిరువు రాతనితో నను గమనము సేయం జనుదెంచి యచ్చో విలపించుచు నుండిరి. అంతలో భీమన మరల నాయూరికి నచ్చుచుండెను. అది గాంచి యచ్చో నుండు కొందఱు బుద్ధిమంతు లాయువతులం బోయి భీమనకుఁ బాదాభివందనంబు సేయుఁ డని తెల్పిరి. అట్లనే యా యిర్వురుయువతులును ముఖంబులయందు శోకచేష్టలం దోఁపనీయక యాకవి కెదురుగఁ జని నమస్కారంబులు గావించిరి. వీం డ్రెవరో యిల్లాం డ్రని నిశ్చయించి వాండ్రభక్తికి మెచ్చి "సౌభాగ్యవతీ భవ" "సౌభాగ్యవతీ భవ" అని దీవించెను. అందుల కాయింతు లానందించి "స్వామీ! మే మదియ కోరి వచ్చినవాండ్రము. కావున మాపతివలనియవజ్ఞత సైఁచి మాకుఁ బతిభిక్ష పెట్టుఁడు" అనుఁడు నామహాకవి వారినిఁ బోతనృపునిభార్యఁ గా గ్రహించి మీభర్త ననుగ్రహించితి మని యీక్రిందిపద్యంబు లిఖించెను.

క. నాఁటిరఘురాము తమ్ముఁడు, పాటిగ సంజీవిచేతఁ బ్రతికినభంగిన్
   గాటికిఁ బో నీ కేటికి, లేటవరపుపోతరాజ లెమ్మా రమ్మా.

అనుఁడు నా రాజన్యుఁడు మూర్ఛఁ జెంది తెలిసినవానివలెనే దీర్ఘ నిద్రం జెందక లేచి తనయెదుట నున్న భీమకవిం జూచి రక్షింపు మని నమస్కరించిన నాతఁ డవు నని వానిం దీవించి బుద్ధి గల్గి బ్రతుకు మని తెల్పి యథేచ్ఛం జనియెను. ఈవృత్తాంతము తురగా రామకవి దని కొంద ఱందురు. అప్పకవీయములో నెల్లూరి తిరుమలయ్య చెప్పినట్లున్న యది.

ఈభీమకవి రామగిరిదుర్గమునకుఁ జొక్క భూపాలుతో దండయాత్రకుం జనియె. అచ్చట నానృపాలుని సాహిణిమారుఁ డనుదండనాయకుఁ డెదిర్చెను. అతనిదౌష్ట్య మధికం బగుడు భీమకవి యీక్రిందిపద్య