ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయ్యలరాజు రామభద్రయ్య.

145



బుగ గది నలంకరించెను. అతఁడును గదిం బ్రవేశించి యష్టముఖగండ భేరుండం బై యెనిమిది గంటంబులఁ బూని యొక్క పెట్టున నెనిమిది యా శ్వాసముల గ్రంథం బగురామాభ్యుదయ మనుదానిని రచియింప నారభించెనఁట. లోపల గంటములచప్పు డధికం బవుట విని రామభద్రుఁడు దర్భశయ్య వదలి లేచి వచ్చి తలుపుకంతనుండి లోనివృత్తాంతము చూచుచో దేహము పులకరించెను. ఇట్లు స్వామి దివ్య తేజోమూర్తిని దర్శించి తన మనంబులో నతనిని స్తుతించి మరల పవళించెను. అనంతరము కొంతవడికి స్వామి వెలుపలికి వచ్చి రామభద్రునిం బిలిచి "యోరీ దీనిం గొని రాజసభం జదువుము. నీకుఁ గారణాంతరముచే నవమానము వచ్చినట్లు గాన్పించి పిమ్మట మామాహాత్మ్యంబున నది నివారితం బగును. ధైర్యమున నుండు" మనియె. రామభద్రుఁడు మహాప్రసాద మని స్తుతి యొనరింప నాతఁ డపు డదృశ్యుఁ డయ్యెను. మఱునాఁడు రాజసభకు గ్రంథమును గొనివచ్చెద నని వర్తమానము బంపెను. ఇట భట్టుమూర్తి యానాఁటిరేయి రామభద్రునకవమానము గల్గించునట్లు ప్రసాదింపు మని తనయిష్ట దేవత యగునాంజనేయు నుపాసించు చుండెను. మఱునాఁడు సూర్యోదయమున రాజు సభదీర్చి కూర్చుండి యుండి విరోధు లగునీయిర్వురుకవులకును వర్తమానము పనిచెను. అట్టివర్తమానము తెలిసి యాయిరువురును నాస్థానమునకు వచ్చిరి. రామభద్రుఁడు తనగ్రంథమును చక్కఁగఁ జదువ నారంభించెను. భట్టుమూర్తి తదేకనిష్ఠచే యోచించుచుఁ ద ప్పెచ్చోనైన వచ్చునా ? రామభద్రు నవమానింతునా ? యని కూర్చుండెను. ఇట్లుండ రామభద్రుఁడు గొంతతడవునకు నీక్రిందిపద్యమునుఁ జదివెను అది యెద్దియనిన :-

"సీ. సింహనఖాంకుర చ్ఛిన్న వారణకుంభ, జనితముక్తాఫలశర్కరిలము
    సమదనూకర పరస్పరభీకరాఘాత, శిథిలదంష్ట్రాచూర్ణ సిక తిలంబు
    గంథసింధురపటు ఘటితసహస్రవ, ద్బంధురదనాంబు పంకిలంబు
    దవగంథవహబంధు దహ్యమానా నేక, శాశికాగురుధూమగంధిలంబు