ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

కవి జీవితములు



ము లైనపనులు వారు నెరవేర్చెద రనియు మనదేశములో నుండుపండితపామరులస్థిరమైనయభిప్రాయము. కావున నిచట భగవంతుఁడు స్వయముగ వచ్చి కార్యము చేసె నని చెప్పిన హిందువులకు నద్భుతముగ నుండదు. అట్టివిధం బగునొకచిత్రకథ మే మిపుడు వివరింపఁ బోవుచున్నారము :-

రామభద్రుఁడు చావ యత్నించుట.

రామభద్రుఁడు చావ నిశ్చయించి సేవకుం బిలిచి వననాభిని దెమ్మనఁగా నావృత్తాంతం బాయనియిష్టదైవం బగురామభద్రుఁ డెఱింగి భక్తరక్షణార్థంబుగ నొకమనుజునివేషము దాల్చి నాభి దెచ్చుటకుఁ జనిన వానిని దాఁచి రామభద్రుని కడ కరుదెంచి "స్వామీ ! తమసేవకుఁ డేడి?" యని యడిగెను. అతఁ డేదియేని పనికై వాని నంగడికిఁ బంపితి ననియెను, అపు డామాయకాఁడు భృత్యునితల్లికి జాడ్యము వచ్చెననియు లోకాంతరగమనమునకై సిద్ధమై యున్న దనియుం దెల్పి వానిం ద్వరగాఁ జూపు మనియెను మంచిది కూర్చుండు మని రామభద్రుఁడు వానిని వెదకుచు నూరంతయుఁ దిరిగి తిరిగి వేసారి సాయంకాల మింటికిఁ జనుదెంచి "యోయీ ! నా కాచావుకంటె నీ చా వెక్కుడుగ నున్నది. వాఁ డెచ్చోటను గాన్పించఁ డయ్యె. ఏమి యుపాయము" అనుడు నామాయలవాఁడు "సామీ ! యాచావంటివెద్ది నాకు దానిం దెల్పు" డని నంప్రశ్నంబు చేసెను. దాని కతఁ డేమియుఁజెప్పక యూరకుండెను. వాఁ డాప్రశ్నమునే మఱలమఱల నడుగ నారభించె. తుదకు రామభద్రుఁడు వేసారి వృత్తాంత మంతయుం దెల్పెను. దాని విని "స్వామీ ! యిట్టిపనికి మీ రింతగ వగవనేల ? నేఁటిరాత్రిలోపల నే నాపని నెఱవేర్చెదను. భయంపడకు" మని యిట్లనియె. "స్వామీ ! యొకగది నలికి మ్రుగ్గులు వెట్టి ధూపదీపంబు లిచ్చి వ్రాఁతకు వలయుసామగ్రి సిద్ధము సేయుఁడు. సూర్యోదయమున కేను గ్రంథము వ్రాసి యిచ్చెద" ననుడు, రామభద్రుఁడు భగవదనుగ్రహము తన యం దిట్లు ప్రసరించుచున్న దని యెంచి యాచిన్న వానివాక్యానుసారం