ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కవి జీవితములు



దులవానింబలె విశేషముగ మనపండితులను సంతసింపఁ జేయును. ఇతని చాటుధారాపద్యములు మన కిపు డేమియు సంప్రాప్తములు కావయ్యెను. కావున నీతనిచే రచియింపఁబడిన రామాభ్యుదయములోని కొన్నిపద్యము లిట వివరింతము :-

స్త్ర వర్ణనము.

"గీ. చొక్కపుఁబసిండినక్కుల చెక్కు చెక్కు,లక్కలికికొప్పునీలాంబుముక్కుముక్కు
    కనకగంథఫలిస్మారకంబుఁకంబు, కలితరేఖావిలాసమంగళము గళము."

కౌసల్య రామునిఁగూర్చి విలపించుట.

సీ. కానక కన్న సంతానమ్ము గావునఁ, గానక కన్న సంతాన మయ్యె,
   నరయ గోత్రనిధానమై తోఁచుఁ గావున, నరయ గోత్రనిధాన మయ్యె నేఁడు
   ద్విజకులాదరణవర్ధిష్ణుండు గావున, ద్విజకులాదరణవర్ధిష్ణుఁ డయ్యె
   వివిధాగమాంతసంవేద్యుండు గావున, వివిధాగమాంతసంవేద్యుఁ డయ్యెఁ

గీ. గటకటా దాశరథి సముత్కటకరీంద్ర, కటకలితదానధారార్ద్రకటకమార్గ
   గామి యెట్లు చరించు నుత్కటకరీంద్ర, కటకలితదానధారార్ద్రకటకతతుల.

భట్టుమూర్తివిరోధకారణము.

ఈకవి, రాయలసభలో మిగులఁ బ్రబలుచుండుటఁ గని యోరువలేక భట్టుమూర్తి యీతనియెడ వైరము సాధించు చుండేను. ఇతఁడు నాతన లక్ష్యము లేకయే మెలంగుచుండెను. ఇట్లుండ నొకనాఁడు భట్టుమూర్తియెడం గరుణించి రాయఁ డాతనికవిత్వమును గొనియాడి యర్ధసింహాసనమునఁ గూర్చుండఁ బెట్టికొనియెను. అట్టి రాయనికృత్యము సభాసదులకు మిగులఁ గష్టముగఁ గాంపించెను. అపుడు భట్టుమూర్తి రామభద్రకవిం జూచి నగిన నాతఁడు కోపించి యీక్రిందిపద్యమును వ్రాసి సభానంతరమున సింహాసనమునకుం గ్రుచ్చి చనియెను. అది యెట్లనఁగా :-

ఉ. [1]పండితు లైనవారలు సభాస్థలి నుండఁగ నల్పుఁ డొక్కఁ డు
     ద్దండతఁ బీఠ మెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్
     కొండకక్రోఁతి చెట్టుకొనకొమ్మకు నెక్కినఁ గ్రింది మత్తవే
     దండమహోగ్రసింహములు తాలిమిఁనుండవె రాజచంద్రమా.

  1. ఈపద్యము మఱియొకనికవిత్వములోనిది గాని రామభద్రునికవనము కాదని కొందఱు చెప్పిరి. ప్రస్తావనుకుఁగా న ట్లితరులపద్యములం జదువుట లోకములోని మర్యాదయే కదా.