ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

కవి జీవితములు



టంబట్టియు రెండవయతనికి నది లేక నవఘంటసురత్రాణుఁ డనుబిరుదుండుటంబట్టియు, లక్షణాభిధేయుఁ డనుబిరుదు లేకుండుటంబట్టియు నీయిర్వురు నొకరు కా రని నిశ్చయింపవల సెను. కాని భాగవతశేషము రచియించినసింగనకవిమాత్రము వీరియిర్వురిలో నెవ్వరిసంతతివాఁడో యిపుడు చెప్పఁజాలము. అతఁడు శ్రీవత్సగోత్రుఁ డగునెఱ్ఱన తనమూల పురుషుం డని చెప్పెను. అందుచే నీయిర్వురిలో నొకఁడు కానోపును. అనిమాత్రము చెప్పవలసి యున్నది.

ఇఁకఁ గొక్కోకకవివరునికాలము నిర్ణయింపఁబడవలసి యున్నది. అది సులభసాధ్యముగాఁ గానుపించుట లేదు. ఈ గ్రంథమును గృతి నందినకుంటముక్కుల మల్లనామాత్యునివంశచారిత్రముంబట్టి చూడవలసి యున్నది. అతనివంశముంగూర్చి వ్రాయుచోఁ గృతిపతితండ్రి యైనభైరవమంత్రింగూర్చి యీ క్రిందివిధంబుగ వ్రాసియున్నది. అదెట్లన్నను :-

గీ. అట్టిబయ్యమంత్రి కనుకూలసౌభాగ్య, భాగ్యగరిమ వెలయుపత్ని యయ్య
   నక్కమాంబతనయు లనఘుల నలువురఁ, గనియె గుణసముద్రు లనుచుఁ బొగడ.

క. వా రెవ్వ రనిన గంగన, ధీరుఁడు పెదమల్లనయును దీప్తయశఃశ్రీ
   ధారుఁడు మల్లామాత్యుఁడు, భైరవుఁడు ననంగ నఖిలభాగ్యోన్న తులై.

   వ. వారిలోన.

సీ. హరిపదధ్యానతత్పరుఁడు చండలమహా,లక్ష్మీప్రసాదైకలబ్ధవరుఁడు
   రహి గజపతిమహారాయ లిచ్చినసమం,చితమహాపాత్రప్రసిద్ధయశుఁడు
   జెమఖానరాయనిచేతను నొడయఁడై, వినుకొండదుర్గ మేలినఘనుండు
   కృతివననిక్షేపనుతతటాకాదిక, ధర్మైకసప్తసంతానఘనుఁడు

తే. "మునిపరాశరగోత్రసంజనితుఁ డార్య, సేవ్యతిరువేంగళాచార్యశిష్యుఁడు నగు,
    మంత్రి పెరుమాళ్ల కొమ్మయమనుమయోబ, మంత్రి తెలగయ భైరవమల్లమంత్రి."

    అనియున్నది.

షష్ఠ్యంతములలో

క. ఇటువంటిమంత్రినిధికిని, పటుతరవిద్యావిశేషపాండిత్యునకున్
   కటక, కలుబరిగ, ఢిల్లీ, కటక స్తవనీయసుగుణగణనిత్యునకున్