ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కవి జీవితములు



సోమయాజికుమారునికొమార్తె యని చెప్పెను. అటుపిమ్మట సింగన తనతండ్రింగూర్చి వ్రాయుచు నతఁడు రాజమహేంద్రవరమునఁ బ్రభుత్వముఁ జేయుచున్నతొయ్యేటి అనపోతభూపాలునిమంత్రి యని యీక్రిందివిధంబుగఁ జెప్పెను. ఎట్లన్నను :-

సీ. ఆత్రేయగోత్రపవిత్రు పేరయమంత్రి, పుత్త్రి సింగాంబిక పుణ్యసాధ్వి
   వెలయ వివాహమై వేఁగిదేశంబులో నేపారురాజమహేంద్రపురికి
   నధిపతి తొయ్యేటి అనపోతభూపాలుమంత్రి యై రాజ్యసంపదలఁ బొదలి
   యొప్పారుగౌతమియుత్తరతటమున మహనీయ మగు పెద్దమనికియందు

గీ. స్థిరతరారామతతులు సుక్షేత్రములును, పెక్కు లార్జించి సితకీర్తిపెంపు మిగిలి
   యఖిలజగదన్న దాత నా నవనిఁ బరఁగె, మధురగుణధుర్యుఁ డయ్యలమంత్రివరుఁడు.

దీనింబట్టి చూడ నీ అయ్యలమంత్రి అనపోతభూపాలునితో సమకాలీనుఁ డని స్పష్టమే కదా. అనపోతభూపాలుడు కొండవీటిసీమలో రాజ్యముచేయువాఁడు. అతనిప్రభుత్వకాలము శా. సం. 1222 మొదలు 1251 వఱకునై యున్నట్లు కొండవీటి రెడ్లశాసనములవలనం గాన్పించును. ఇదియే అనఁగా శా. సం. 1200 మొదలు 1250 వఱకును, అతనిమంత్రి యగునయ్యలమంత్రికాలముగా నిర్ణయింపవలయును. అయ్యలమంత్రి మొదలు తిక్కనసోమయాజివఱకును బైని చెప్పిన విధమున నైదుగురుపురుషు లైరి. పురుషునకు ముప్పదిసంవత్సరముల చొప్పున నైదుగురికిని నూటయేఁబదివత్సరము లగును. ఇది పండ్రెండువందలలోఁ ద్రోసివేయఁగ 1050 శా. సంవత్సర మగును. ఇది తిక్కనసోమయాజి కాలమును నిర్ణయించుట కొకమార్గము.

2. ఇఁక రెండవవిధ మెట్లన్నను :- గోదావరీమండలములోని దాక్షారామదేవాలయముపై నున్నయొకశిలాశాసనములో శా. సం. 1098 (SS. 1098 + 77 = 1175 AD) లోఁ గాకతీయగణపతిరుద్రుని యల్లునిదాన మున్నది. దీనింబట్టి కాకతీయగణపతికాల మంతకుఁ బూర్వ మిరువదిముప్పదిసంవత్సరము లైనను నై యుండవచ్చును. ఈ గణపతిరుద్రునికడకే తిక్కనసోమయాజి పోయి యుండె ననియు, నతని