ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కవి జీవితములు



రామాయణముం గృతి నందినసిద్ధిరా జైనట్లును నిశ్చయింపఁజాలము. కావున సోమయాజికాలనిర్ణయ మీమూలముగఁ గాలేదు.

2. ఆంధ్రకవిచారిత్రములోని మఱియొక యుదాహరణములోఁ దిక్కనసోమయాజికుమారుం డగుమారన మార్కండేయపురాణమును తెనిఁగించి దానిని ప్రతాపరుద్రదేవునిమంత్రి యగునాగయగన్న మంత్రికిఁ గృతి యిచ్చెఁ గావున దానింబట్టి తిక్కనసోమయాజికాలము నిర్ణయించెద మని చెప్పి యున్నది. ఇంతమాత్రమునఁ దిక్కనసోమయాజి కాలమునిర్ణయింప వలనుపడదు. ప్రతాపరుద్రదేవుఁ డనునామము కాకతీయవంశస్థులలోఁగొందఱకును, కటకప్రభువులలోఁ గొందఱకును నున్నది. వీరిలో నెవ్వరి మంత్రిగానున్న నాగయగన్న మంత్రికిఁ గృతి యిచ్చెనో తెలియదు. ఎట్లైనను మనదేశములో విశేషవ్యాప్తనాముఁ డగు వాఁడెవ్వఁడో అతనిమంత్రియగు నాగయగన్న మంత్రికే కృతి యిచ్చె నని యూహింతము. "M. R. Sewell's Lists of Antiquities" అను న్యూయల్ దొర గ్రంథములో నీక్రింద నుదాహరించినవారు రుద్రనాములై యున్నారు. ఎట్లన్నను :-

క్రీ. శ. = శా. సం.
1179-77 = 1102 లో నొకరుద్రుఁడు.
1179-77 = 1120 "
1255-77 = 1202 "
1299-77 = 1222 "
1310-77 = 1242 "

ఇట్లుగా నైదుగురురుద్రు లున్నారు. వీరు గాక పద్మనాయకులవంశావళీశాసనముం జేయించినరుద్రుఁడు మఱియొకఁ డున్నాఁడు. ఇతఁడు శా. సం. 1019 లోనివాఁ డైన ట్లా శాసనమువలనఁ గాన్పించును. కోనసీమద్రావిడులకు నగ్రహారములును, స్వాస్థ్యములు నిచ్చినరుద్రుఁడు మఱియొకఁ డున్నాఁడు. ఇతనికాలము శా. సం. 1087. ఇట్లు