ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పుటలు
ముతో తీర్థ స్నానము చేసి నెమ్మది పడుదురనిన్ని, విరామదశను పొందదలచిన మనుష్యులు వొక్కచోటనేవుండి మోక్షమును పొందుదురనిన్ని, పురాణములద్వారా తీర్త ములకున్న, క్షేత్రములకున్ను, క్షేత్రములకున్ను మజిమలు కలగచేసినారనిన్ని పుత్రాదులకు తల్లితండ్రాదులు వున్నట్టుండి చనిపోతే వారి ఋ ణముతీర్చు కోక పోతిమిగదా అనేపశ్చాత్తాపము తీరేకొరకు, గయా ప్రజనాదులకు మహిమలు కల్పించినారనిన్ని చెప్పబడియున్నది. ....221-222
205యిందులో క్రీస్తుమతస్థులు దేవుడు వొక్కడయి యుండగా మీ మతములో అనేక దేవతలు గలరని యేలాగు చెప్పుచునారని ప్రశ్న చేయగా మాలోనున్ను దేవుడు వొక్కడేను. అయితే మీలో సేయింట్సు అనే దేవసమానులైన పురుషుకు అరాధించేలాగు మాలోనున్న శివవిష్ణు గణపతి మొదలైన దివ్యపురుషులను అరాధింపుచున్నాము గాని దేవుడు వొక్కడేననేటందుకు సందేహము లేదని చెప్పియున్నది.233-234 207 యిందులో కొన్నిచోట్ల జలము బియ్యమువుడికే పాటి వేడికలిగి వుండుటకు కారణమేమంటే గంధములోఅగ్నిత్వరగా ఉత్పత్తి కావడము సహజము గనుక ఆ చోట్లు గంధక మయమైనందున జలము ఉష్ణముగా వుంచున్నదని చెప్పబడియున్నది. 235-236 209 యిందులో జగదీశ్వర కటాక్షముగలవారికే ఆణిమాద్యష్ట సిద్దులు కలగడానికు హేతువులయిన మూలికలు సిద్ధించుగాని ఇతరులకు సిద్ధించనేరవని చెప్పబడియున్నది.237-238 214యీ గొప్ప ప్రసంగములో మధ్యమతము గయలో వ్యాపించినదుకు కారణమున్ను గయావళీలనువిమంత్రణ చెప్పుటకు హేతువున్ను చప్పన్న దేశస్థిన్ని భూగోళ స్థితిన్ని చతుదన్ శ భువనస్థిన్ని ధ్రువద్యయ స్థితిన్నిదేవరాక్షస స్థితిశ్రమమున్ను వైకుంఠాది లోకస్థితిన్ని సముద్రముల