పుట:Kasiyatracharitr020670mbp.pdf/193

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిట్లావుండగా సూర్యభగవానుడు చాయాదేవికి గర్భోత్పత్తి అయ్యేటట్టు చేసెను. తదనంతరము ఆమె తపస్సు చెస్తూ వుండేను. మళ్లీసూర్యుడు ఆమెతో సంగమము యిచ్చయించి నంతలో ఆమెగర్బావస్థలో సంగమము విధివవ్యతిరిక్తమని సమీపానికి రాక పోయినది. సూర్యుడు మోహావేశ యుక్తుడయి చాయాదేవి సమీపానికి వచ్చినాడు గనుక వెంబడిగానే అతని తేజోవేగానికి అమెగర్భము నిలవలేక్ విచ్చిత్తి అయిపోయినది. ఆ చొప్పున విచ్చిత్తి అయిన గర్భము కొంతమట్టుకు ఒక పిండాకృతిగా నున్ను కొంతవుదకముగా నున్ను స్రవించి నందున చాయాదేవి సహితముగా సూర్యుడు విస్మయాన్ని పొందినాడు. వెంబడిగానే హరిరుద్రాదులు ప్రసన్నులయి రుద్రుడు తన శక్తిని ఆ పిండములో ఆవాహనచేసి యమధర్మరాజు అనే ఒక పురుషుణ్ణి ఆ పిండము ద్వారా వుత్పత్తిచెసి భూమిలో దక్షిణభాగమందు వుండేటట్టు నీమించి పాపులను విచారించి శిక్షింఛేటట్టు నీమించినాడు. విష్ణువు తత్ప్రతిగా స్రవించిన వుదకములో తన శక్తిని ఆవహింపచేసి యమునా అనే నామముతో ఒక స్త్రీని ఉత్పత్తిచేసి నదీరూపముతో భూమిలో లోకుల పాపాలను పోగొట్టుచు రమ్మని నీమించినాడు. అప్పుడు ఆ యమునా అనే స్త్రీ నదీస్వరూపముతో యీ పుణ్యక్షేత్రానికి ప్రవహించి వచ్చినది. యిక్కడ విరాజమాన్యుడుగా వుండే మాధవమూర్తి ఆ స్త్రీ సౌందర్యము చూసి మోహితుడై భార్యగా వరించినాడు.

యిట్లుండగా రామాయణములో వివరించిన హేతువులచేత భగీరధుడు గంగను కూడా భూలోకమునకు తీసుకొని వస్తూవుండగా గంగ యీ క్షేత్రములో ప్రవేశించగానే యమునకు సమాచరము తెలిసి యెదురుకొని పొయి ఆరాధించి తనతొ కూడా కలిసి ప్రవహించనలెన్ని ప్రార్ధించినది. అందుకు గంగ చెప్పిన దేమంటే నీవు మహా ప్రసిద్ధురాలయితివే. నీతో కలిస్తే నాపేరే లేకపోనేమో అని సందేహించి నంతలో యమునానది గంగాసహావాసాపేక్షితురాలై యీ క్షేత్రము మొదలుగా నీవు నాతో కలిసి ప్రవహిస్తే పేరు నీదేను. నాప్రవాహ స్వరూపము మాత్రము వేరుగా వుండతగ్గదని