ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

71


బ్రాణములు దాల్చియుండుము. తరువాతఁ జూచుకొనవచ్చునని పలుకుచు నా పాదంబులం బడినది.

జీవితాశ యెల్లరకు దుర్లంఘ్యమయినది. కావున నే నట్లు చేయుటయే యుత్తమమని తలంచి జీవితమును విడువఁజాలక కపింజలుని రాక గోరుచు నతిదారుణమైన యారాత్రి తరళికాసహాయినినై సహస్రయుగప్రాయముగా వెళ్ళించితిని.

మరునాఁ డరుణోదయంబుమున నాసరస్సులో స్నానముచేసి పుండరీకునికిఁ బ్రీతిగాఁ దత్కమండలము తద్వల్కలము దజ్జపమాలికను ధరించి సంసారమసారమనియు వ్యసననిపాతము లప్రతీకార సాధ్యములనియు శోకము దుర్ని వారమైనదనియు దైవము నిష్ఠురుఁడనియు సుఖములనిత్యములనియు నిశ్చయించి తల్లిదండ్రుల లెక్క సేయక పరిజనములతోఁగూడక సకలబంధుజనులను మనసుచేత నిరసించి యింద్రియసుఖములయందుఁ జొరకుండ చిత్తమును నియమించి బ్రహ్మచర్యవ్రతమును గైకొని భక్తజనతత్పరుం డగు నీ పురహ నారాధింపఁ దొడంగితిని.

నావృత్తాంతమును విని సకలబంధుపరివృతుండై నాతండ్రి వచ్చి యింటికి రమ్మని యెంతేని బ్రతిమాలెను కాని నామనము తిరిగినది కాదు. పుత్రికాస్నేహంబున నతండు పెద్దతడవు నాకొరకు నిరీక్షించుకొని చివరకు నిరాశుడై దుఃఖముతో నింటికిఁబోయెను.

నాటంగోలె నేనిందు నమ్మహాపురుషుని కశ్రుమోక్షణమాత్రంబున కృతజ్ఞత జూపించుకొనుచు జపవ్యాజమునఁ దద్గుణముల లెక్కించుకొనుచు బహువిధములగు నియమములచేత శరీరమును వాఁడజేయుచు నీత్ర్యంబకుని సేవింపుచు నాతరళికతోఁగూడ నీగుహ యందు వసించియుంటిని.

మహాభాగ! ఆబ్రహ్మహత్యాపాతకురాలను నేనే. ఇదియే