సునీతి కథ
31
భీమ - వాళ్ళనెందుకు ?
మా - ఎందుకేటి, ఉన్నన్నాళ్ళు తిన్నగా చూచి యెప్పుడో కోపము వచ్చి, యీ ముండ చంపిస్తూంటది. ఏలాగైతేనేమి, సాలుకి నా కొకసంచీరూపాయలు ముట్టచెప్పుతుంది.
భీ - నీకు మంచియండే దొరికినది ఇక్కడనుండి నన్నుగూడా పిలుచుచుండేం.
మా - ఒరే భీమా! ఈయేడు మీజట్టుకు కన్నాలవల్ల మొత్తం లాభం యెంత వచ్చిందిరా.
భీమ - ఇంకాపంచుకోలేదు ఏలాగైనా, నిరిటికన్న తక్కువే. ఏముంది, బంట్రోతులకు అమ్మోరుకి, పంచాంగం చెప్పిన భేమ్మడికీ, నాయకుడికీ, పాలుపంచిపెట్టాలిగంద! ఈఖర్చులన్నీ పోగా, యేముంటుంది.
మా - అయినా మునుపటి లాభాలు లేవు . అన్ని యిళ్ళల్లోను ఇనుపపెట్టెలే. గాజుదీపాలే అవి ఆర్పుటయే తెలియదు. ఇంతకు చవక చమురు మనకొంపదీయు చున్నది.
భీ - ఏమో! మనకు ప్రాప్తి వున్నంతవస్తుంది. సరిగా నడువుము.
అని యీరీతి మాటాడుకొనుచుండగా నా దొంగల మాటలన్నియు విని జయభద్రుడు అనంగచంద్రిక చేసిన క్రూరకృత్యమని తెలిసికొని అప్పు డేమియుంజేయునది తోచక భగవంతుని ధ్యానముచేయుచు, ఆయ్యో! వారకాంతల వలపులు నమ్మగూడదవి చెప్పిన నా మిత్రుని మాటలు వినకపోవుటచేతగదా, యింతయాపద వచ్చినది. నాకు విధాత బలవన్మరణము విధించెనుగాబోలు. ఇప్పుడు పాఱిపోవుదమన్నను వీండ్రు నన్ను బోనీయరు. నాకు ఈతవచ్చునుగదా? దెబ్బతగులక, స్మృతిగా నుంటినేని బ్రతికి యీవలబడగలను. ఇంతకు దైవసంకల్ప మెట్టిదో తెలియదు. అని పలువిధముల వితర్కింపుచు గదలక, అట్లేయుండెను. ఇంతలో నూయి సమీపించుటయు, నా చోరులా మంచముతోగూడ నాతని 'చావుము ' అని పలుకుచు, నా నూతిలో బారవైచిరి.
జయభద్రు డానూతిలో బడుసమయములో దనకది చరమావస్త అని నిశ్చయించి, నారాయణ మంత్రము జపించుచు గ్రమముగా నా నూతినీటిలో బడియెను.
ఆ కూపమున నీరు మిక్కుటముగా నుండుటచే నతనికంత రాయిడి తగిలినది కాదు ఇంచుక మునింగి యీతవచ్చుటచే గాలుసేతులు గదల్చుచు, మెల్లన నానూతి గోడమీద మొలచిన మఱ్ఱిమొక్క. పట్టుకొని యలసట దీర్చుకొనుచు దనయవస్థను గుఱించి వేదెరంగుల దలంచుచుండెను.
ఇంతలో మఱియొకజంతువు దానిలో బడినట్లు గుభాలుమని చప్పుడైనది. అతండదరి పడుచు నోహో! దీనిలో మఱియేదియో పడినట్లు చప్పుడైనది. ఈదొంగలలో నొకడు నన్ను బట్టుకొనుటకై యఱుగలేదుగద? ఏమైనను మేలగు