పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మునకు వగచుచు నారదుంజూచి మామా! నేను తొందరపడి నిన్ను శపించితిని. నాశాపము మరలించెదనన్ను స్వర్గమునకుబోవునట్లనుగ్రహింతువా? అనియడిగిన నతండంగీకరించెను. ఒండొరులశాపములఁ గ్రమ్మఱించుకొనిరి. పర్వతుఁడు నాకంబునకుఁబోయెను, నారదుండు వెనుకటి ముఖముతో నొప్పుచుండె నాదమయంతి మిక్కిలిసంతసించుచుండెను.

దమయంతినిమిత్తముగా నారదుండా సృంజయునకు సువర్ణష్ఠీవియను పుత్రుందయచేసి వానిమృత్యువువలన రక్షించి వంశహాని కాకుండ ననుగ్రహించెననియెఱింగించునప్పటికిఁ గాలాతీతమగుటయు

క. లే లెమ్ము మిగిలెఁ బయనపు
   వేళకథాగతరసప్రవృత్తాస్థన్ గో
   పాలా! యని యమ్మునిశా
   ర్దూలుఁడు చని చేర శిష్యుతోఁ బయినెలవున్.

_________

216 వ మజిలీ

నారదుని స్త్రీ జన్మము.

సౌభాగ్యసుందరి కథ

క. శ్రీనారదవరవీణా
   గానస్వానానురక్త కరుణావిలస
   న్మానస తాపసహృదయా
   స్థానసుఖాసీన భక్తజనసంతానా.

దేవా! అవధరింపు మమ్మణిసిద్ధుఁడా నివాసదేశంబున నిత్య కృత్యంబులఁ దీర్చికొనిపిదప రమ్మస్థలాసీనుఁడై శిష్యునుద్దేశించి

క. హరిమాయామోహితుఁడై
   తరుణీమణియగుచు దేవతాముని భూమీ