పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఆవిషయమై యిరువురకు మరలసంవాదము జరిగినది. నారదుండు కాంతల గర్హించుచుఁ బెండ్లియాడనని నిర్భయముగాఁ బ్రత్యుత్తురమిచ్చెను. కానిమ్ము నీచేఁ బెండ్లియాడింపక పోవుదునా చూతువుగా అని తలకంపించుచు నప్పటికూరకొనియెను.

అని యెఱింగించి....

__________

215 వ మజిలీ.

నారద వివాహము

దమయంతి కథ.

నారదమహర్షి యొకనాఁడు | భాగినేయుండగు పర్వతునితోఁ గూడ భూలోకవిశేషంబులం జూడవేడుకపడి గగనమార్గంబున భరతఖండమునకరుదెంచియందుఁగల తీర్థక్షేత్రారణ్యయ విశేషంబులంజూచుచుఁ దిరిగితిరిగి యొక గ్రీష్మాంతమునఁ జాతుర్మాస్యవ్రతంబు సేయఁదలంచి సృంజయుండను న్యపకుంజరుని గృహంబునకరిగి యతనిచే సన్మానితుఁడై యిట్లనియె. మహారాజా ! మహర్షులకు వర్షకాలమున యాత్రలు సేవించుట దుర్ఘటమగుట నొక్కచో నీనాలుగుమాసములు వసించి వ్రతంబు బూర్తిసేయవలసియున్నది. మీయింటవసించుట కనుకూలమగునే అని యడిగిన సృంజయుం డిట్లనియె.

మహాత్ములారా! మీయట్టి తాపసోత్తముల చరణరజస్సంపర్కంబుఁ బొందనిభవనంబు వనంబుగాదే. మదీయభవనోద్యానవస్తు వాహనాదికములనెల్ల మీయథీనముగావింతు మీయిచ్చవచ్చినట్లు వాడు కొనుఁడు అనుభవింపుఁడు. అనిపలికిన విని నారదుం డిట్లనియె. మహారాజా! ఇట్లనుటకు నీ కే చెల్లును. మాకస్తోకములగు భోగము లవసరములేదు. ప్రతనియమవిశేషంబులకుఁ దగిన పరికరంబులంగూర్ప నేర్పు గలిగిన పరిజనుల నియమింపుము. ఇంతియ చాలునని తెలిపిన నమ్మను